ఢిల్లీలో పార్లమెంట్‌నూ కూల్చబోతున్నారట..!

తెలంగాణలో సెక్రటేరియట్ కూల్చివేతపై జరుగుతున్న రాజకీయ రగడ అంతా ఇంతా కాదు. భారతీయ జనతా పార్టీ నేతలు కూడా.. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నారని మండిపడ్డారు. అనూహ్యంగా బీజేపీ కూడా అలాంటి చారిత్రకమైన కట్టడాన్ని కూల్చివేస్తామని చెబుతోంది. ఆ చారిత్రక కట్టడం ఏదో కాదు.. పార్లమెంట్ భవనమే. ప్రస్తుత పార్లమెంట్ భవనం పురాతనమైందని, దాన్ని కూల్చేస్తామని సుప్రీంకోర్టులోనే నేరుగా అఫడవిట్ దాఖలు చేసింది. పార్లమెంట్ భవనం వంద ఏళ్ల పురాతన భవనమని, భద్రతా పరంగా చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని కేంద్రం చెబుతోంది. ప్రస్తుత పార్లమెంట్ భవనం 1937లో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుత అవసరాలకు సరిపోదని కేంద్రం చెబుతోంది.

కేంద్ర ప్రభుత్వం.. కొద్ది రోజుల కింట.. సెంట్రల్ విస్టా అనే ప్రాజెక్టును ప్రతిపాదించింది. దీని ప్రకారం.. ప్రభుత్వ వ్యవస్థలన్నీ ఒక్క చోటకే వస్తాయి. ఢిల్లీలో వివిధ చోట్ల ఉన్న పాలనా కార్యాలయాలన్నీ.. ఒక్క చోటకు తెచ్చేలా.. ఓ కొత్త కార్యాలయ భవన సముదాయాల్ని నిర్మించాలని నిర్ణయించారు. సెంట్రల్ విస్టా పేరుతో ప్రణాళికలు కూడా సిద్ధమయ్యాయి. ఇందులోనే కొత్త పార్లమెంట్ భవనం కూడా ఉండనుంది. కొత్త పార్లమెంటు భవనాన్ని దేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకొనే 2022 ఆగస్టు 15నాటికల్లా అందుబాటులోకి తేవాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రస్తుతం దేశం ఆర్థికంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. కరోనా కారణంగా వృద్ధి రేటు మైనస్‌లోకి వెళ్లిపోతోంది. ఈ కారణంగా.. రూ. 20 వేల కోట్ల ఖర్చు అయ్యే సెంట్రల్ విస్టా లాంటి ప్రాజెక్టుల్ని నలిపివేయాలనే సూచనలు కేంద్రానికి వస్తున్నాయి. అయితే.. అలాంటి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించి తీరుతామని ప్రభుత్వం.. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌తోనే తేలిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close