ఏపీకి రైల్వే జోన్ కూడా హుష్ కాకి?

ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామీలను తప్పకుండా అమలుచేస్తామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు నేటికీ పదేపదే చెపుతున్నారు. హామీల అమలుపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేసారు. కానీ హామీల గురించి ఒక మాట చెపుతుంటే, మిగిలినవారు మరొకలాగా మాట్లాడుతున్నారు. ఇంత కాలంగా వెంకయ్య నాయుడు తదితరులు విశాఖకు రైల్వే జోన్ కేంద్రప్రభుత్వం ఏ క్షణంలోనయినా ప్రకటించవచ్చునని చెపుతున్నారు. కానీ ఇప్పుడు కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటుకి ఇబ్బంది ఉందని, దాని కోసం రాజ్యాంగ సవరణ చేయవలసి ఉంటుందని చెపుతున్నారు. అదే నిజమయితే మరి ఇంత కాలం ఈ సంగతి తెలియకుండానే వెంకయ్య నాయుడు తదితరులు రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని ప్రజలకు హామీలు ఇస్తున్నారా? ఒకవేళ నిజంగా రాజ్యాంగ సవరణ అవసరమయితే మరి ఇన్నాళ్ళు ఎందుకు ఆ ప్రయత్నం చేయలేదు? ఒకవేళ రాజ్యాంగ సవరణ చేయడం సాధ్యం కాకపోతే ఈ హామీని కూడా పక్కనపడేస్తారా? అనే ప్రశ్నలకు సమాధానలు తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడక తప్పదు. ప్రత్యేక హోదాకి 14వ ఆర్ధిక సంఘం అభ్యంతరాలు చెపుతోంది, విజయవాడలో 20లక్షల మంది జనాభా లేరు కనుక అక్కడ మెట్రో రైలు ప్రాజెక్టు లాభసాటికాదు. కనుక దానికి నిధులు మంజూరు చేయలేమని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు రైల్వే జోన్ ఏర్పాటుకి రాజ్యాంగ సవరణ అనే కొర్రీ పడినట్లుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జూన్ 27న ‘క‌ల్కి’

ప్ర‌భాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'క‌ల్కి' రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొంది. దీనిపై అతి త్వ‌ర‌లోనే నిర్మాత‌లు...

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close