‘విజ్‌క్రాఫ్ట్‌’కు అమరావతి ఈవెంట్ – రాజుకున్న వివాదం

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన ఈవెంట్‌ను ముంబాయికి చెందిన ‘విజ్‌క్రాఫ్ట్’ సంస్థకు ఇచ్చారన్న వార్తలపై వివాదం రాజుకుంది. తుళ్ళూరు మండలం వెంకటపాలెం సమీపంలో సుమారు 50 ఎకరాల స్థలంలో రానున్న విజయదశమికి జరగనున్న ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. దేశప్రధాని నరేంద్రమోడితోబాటు సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమ నిర్వహణను అంతర్జాతీయస్థాయిలో నిర్వహించాలని, నిర్వహణను ఈవెంట్ మేనేజిమెంట్ సంస్థకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఈనెల 16న సీఆర్‌డీఏ సంస్థ ఈ-టెండర్‌లు ఆహ్వానించింది. ఈ ఈవెంట్‌ను రు.9.5 కోట్లకు విజ్‌క్రాఫ్ట్ సంస్థ దక్కించకుందని ఇవాళ ఒక ప్రముఖ తెలుగు దినపత్రికలో ఓ కథనం వచ్చింది. ఆ సంస్థకు టెండర్ ఇవ్వటం ఏకపక్షంగా సాగిందని ఆ కథనంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పురపాలకశాఖమంత్రి నారాయణ ఇవాళ మధ్యాహ్నం దీనిపై ఒక వివరణ ఇచ్చారు. ఇంతవరకు ఏ సంస్థకూ ఆ బాధ్యతలు అప్పగించలేదని విజ్‌క్రాఫ్ట్ పేరు పరిశీలనలోమాత్రమే ఉందని మీడియాతో చెప్పారు. అయితే ఈ మొత్తం వ్యవహారం పారదర్శకంగా జరగటంలేదన్నదిమాత్రం వాస్తవం. వ్యవహారం మొత్తం పారదర్శకంగా నడపటంకోసమే ఈ-టెండర్‌లను పిలుస్తారు. కానీ ఇక్కడ అంతా తిరకాసుగానే కనిపిస్తోంది. దానికితోడు దీనిపై తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే దినపత్రికలో కథనంరావటం మరింత విచిత్రంగా ఉంది. ఒకవేళ ఆ పత్రికకు చెందిన ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వకపోవటంవల్ల ఈ కథనం వెలువడిందా అన్న వాదనకూడా వినబడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close