ప్ర‌భాస్‌ని సుకుమార్ క‌లిశాడా?

‘ఇదిగో పులి’ అంటే… ‘అదిగో పులి’ అన్నట్టుంది పరిస్థితి. ‘రంగస్థలం’ విజయంతో దర్శకుడు సుకుమార్ పేరు గట్టిగా వినబడుతోందిప్పుడు. ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ జనాలకు కూడా విజయం కనబడుతోంది. దాంతో సుకుమార్ నెక్స్ట్ సినిమా ఎవరితో? అనే డిస్కషన్ మొదలైంది. ముందు అల్లు అర్జున్ పేరు తెరపైకి వచ్చింది. అతడితో సుకుమార్ ‘ఆర్య’, ‘ఆర్య-2’ సినిమాలు, ‘ఐయామ్ చేంజ్’ షార్ట్ ఫిల్మ్ చేశాడు. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తరవాత లైనులో మరో సినిమా లేని ఏకైక స్టార్ బన్నీ కావడంతో అతడితో ముడి పెట్టారు. తాజాగా ప్రభాస్ పేరుతో సుకుమార్ పేరు వినబడుతోంది. ఇటీవల ‘బాహుబలి’ స్టార్‌ ప్ర‌భాస్‌ని సుకుమార్ క‌లిశాడ‌నే వార్త‌లూ గుప్పుమ‌న్నాయి. దీనినంతటికీ కారణం ఒక్కటే… ‘ప్రభాస్‌తో చేయాలని వుంది’ అని సుకుమార్ చెప్పడమే. (ఇది చదవండి: https://www.telugu360.com/te/sukumar-about-his-intention-to-make-movie-with-prabhas/)

ప్రస్తుతం ‘రంగస్థలం’ విజయం అందించిన ఆనందంలో సుకుమార్ వున్నారు. తదుపరి సినిమా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో చేయాలనే ఒప్పందం ఒక్కటీ తప్ప… ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆయన దగ్గర రెండు మూడు కథలు వున్నాయట. అదీ లైన్ల రూపంలో! కొన్నాళ్లు విరామం తీసుకుని వాటిని హీరోలకు వినిపించి, ఒకే చేయించుకుని స్క్రిప్ట్ వర్క్ చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈలోపు కొత్త ఐడియాలూ రావొచ్చు. ఈ మధ్య ఆయన్ను ఎవరు కలిసినా.. అభినందనలు తప్ప మరొక అంశం ప్రస్తావనకు రావడం లేదట. ఒకవేళ కొత్త సినిమా ప్రస్తావన వచ్చినా… ఈ సందడి తగ్గిన తరవాత డిస్కస్ చేద్దామని అంటున్నారట. ప్రభాస్, సుకుమార్ కాంబినేషన్ సెట్ చేయాలని కొంతమంది నిర్మాతలకు వుంది. ప్ర‌భాస్‌తో చేయాలని సుకుమార్ మనసులోనూ వుంది. తెరపైకి ఎప్పుడు వస్తుందో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close