టాలీవుడ్ దర్శకుడు ఎ.ఎస్. రవికుమార్ చౌదరి కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. నిన్న రాత్రి హార్ట్ ఎటాక్తో మృతిచెందారు.
గోపిచంద్ హీరోగా వచ్చిన ‘యజ్ఞం’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ సినిమా సూపర్ హిట్. ఆ సినిమా విజయంతో బాలకృష్ణతో ‘వీరభద్ర’ సినిమా తీసే అవకాశం అందుకున్నారు. అయితే ఈ సినిమా ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది.
తర్వాత ‘ఆటాడిస్తా’, ‘ఏం పిల్లో ఏం పిల్లాడో’, ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘సౌఖ్యం’ సినిమాలు తీశారు. ఇందులో ‘పిల్లా నువ్వు లేని జీవితం’ డీసెంట్ సక్సెస్ అందుకుంది. ‘తిరగబడరా సామీ’ ఆయన చివరి సినిమా.
రవికుమార్ చౌదరి ‘జగడం’ సినిమాలో నటుడిగా కూడా కనిపించారు. ఆయన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కారు. ‘తిరగబడరా సామీ’ ప్రమోషన్స్లో చాలా హడావిడి చేశారు. ఆయన ఇంటర్వ్యూలు కొన్ని వైరల్ అయ్యాయి. చాలా పట్టుదల ఉన్న వ్యక్తిగా పేరుగాంచిన రవికుమార్ చౌదరి, కొత్తవారితో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే ఇంతలో ఆయన కన్నుమూయడం బాధాకరం.