కృష్ణా నీళ్ల జోలికి రావొద్దని సింపుల్‌గా చెప్పిన కేసీఆర్..!

” రాయలసీమకు నీటిని తీసుకెళ్లాలి. గోదావరి మిగులు జలాల నుంచి తీసుకెళ్లాలి..! ” … ఇదీ పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుకుంటూ.. సంగమేశ్వరం ఎత్తిపోతలను నిర్మించుకునేందుకు ఏపీ ఇచ్చిన జీవో నెం 203పై కేసీఆర్ స్పందన. కొట్లాటలు పెట్టుకోబోమని చాలా శాంతంగా చెప్పారు. కానీ కేసీఆర్ వ్యాఖ్యలో ఓ రకమైన హెచ్చరికలు కనిపిస్తున్నాయని చెప్పక తప్పదు. ఎందుకంటే.. రాయలసీమ ఉంది.. కృష్ణా బేసిన్‌లోనే. గోదావరి నీరు రాయలసీమలో పారాలంటే.. అంత తేలికగా సాధ్యమయ్యే వ్యవహారం కాదు. లక్షల కోట్లు వెచ్చించాలి.. ఇంజనీరింగ్ అద్భుతాలు చేయాలి… ఇవన్నీ జరిగే సరికి ఏళ్లుపూళ్లు పడుతుంది.

కృష్ణా జలాల్లో ఏపీకి వాటా లేదన్నట్లుగా కేసీఆర్ వాదన..!

గోదావరిలో మిగులు జలాలు ఉన్నాయని.. వాటిని రాయలసీమకు తరలించాలని.. కేసీఆర్ చెబుతున్నారు. గోదావరి నీళ్లతో రాయలసీమను బాగుచేసుకోమని చెప్పాం..కృష్ణా జలాలను వాడుకుంటామంటే క్షమించేది లేదని మొహమాటం లేకుండా తేల్చేశారు. …అంటే.. కృష్ణా నీటిపై ఆశలు వదిలేసుకోవాలని ఆయన చెప్పడమే. శ్రీశైలం ప్రాజెక్ట్ నుండి.. తెలంగాణకు మాత్రమే నీళ్లు దక్కుతాయని.. రాయలసీమకు అందులో వాటా లేదన్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయి. సీమకు నీళ్లు తీసుకెళ్లాలంటే.. గోదావరి నుంచి శ్రీశైలంకు మళ్లించి ఆ నీటిని మాత్రమే తీసుకెళ్లమంటున్నారు. అయితే.. కృష్ణా నీటి కేటాయింపుల్లో.. తమ వాటాను మాత్రమే వినియోగించుకుంటామని ఏపీ ప్రభుత్వం వాదన వినిపిస్తోంది. కానీ కేసీఆర్ ఈ వాదనను పట్టించుకోవడం లేదు. కృష్ణా నీటిలో.. దిగువ రాష్ట్రమైన ఏపీకి హక్కు లేదన్నట్లుగా వాదిస్తున్న అభిప్రాయం కనిపిస్తోంది. తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగితే సహించబోమని ఆయన మొహమాటం లేకుండా చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం.. తెలంగాణ ప్రయోజనాలను కేసీఆర్ లైట్ తీసుకుంటారని.. ఎవరూ అనుకోరు.

బేసిన్లు.. భేషజాలు లేవంటే అర్థం ఇదా..?

కృష్ణా నీటిలో ఏపీ వాటాను పూర్తిగా రాయలసీమకు తరలించేందుకు గత ప్రభుత్వం… గోదావరి నీటిని పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా కృష్ణా డెల్టాకు తరలించింది. దాంతో.. శ్రీశైలంకు వచ్చిన వరదను.. నేరుగా.. రాయలసీమకు తరలించే అవకాశం ఏర్పడింది. ఈ కారణంగా సీమకు నాలుగేళ్ల పాటు ఎక్కువగా నీరు లభించింది. అదే సమయంలో.. నాగార్జున సాగర్‌కు నీటి విడుదల, లభ్యత తగ్గిపోయింది. ఇది నల్లగొండ, ఖమ్మం జిల్లాల తెలంగాణ రైతులకు ఇబ్బందికరంగా మారింది. పట్టిసీమ ద్వారా ఏపీ డెల్టాలోని కృష్ణా బేసిన్ పంటలకు నీటి కొరత రాలేదు. అందుకే.. తెలంగాణ ప్రభుత్వం.. ప్రాజెక్ట్‌లోకి కొద్దిగా నీరు చేరగానే విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించేసి..నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉంటుంది.

కృష్ణాలో వాటా కాపాడుకోకపోతే.. సీమ ఏడారే..!

విభజనలో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రెండు భారీ ప్రాజెక్టులు నాగార్జున సాగర్, శ్రీశైలంల నిర్వహణ చెరో రాష్ట్రానికి వచ్చింది. శ్రీశైలం నిర్వహణ ఏపీకి వచ్చింది. అయితే.. శ్రీశైలంలో చేరే నీరును వచ్చినది వచ్చినట్లుగా తోడుకోవడానికి తెలంగాణకు అవకాశం ఉంది. వరద వస్తున్నప్పుడే.. 800 అడుగులకు చేరుకోగానే కల్వకుర్తి సహా పలు ఎత్తిపోతల ద్వారా తెలంగాణ నీరు తోడుకుంటోంది. కానీ ఏపీకి ఆ అవకాశం 841 అడుగులు వచ్చిన తర్వాతే వస్తోంది. అయితే.. కృష్ణా బోర్డు కేటాయించాలి. కానీ వరదల సమయంలో రెండు రాష్ట్రాలు నీటిని తోడుకుంటున్నాయి. ఇప్పుడు.. కేసీఆర్ భిన్న వ్యూహంతో… కృష్ణా నీరు.. దిగువకు వస్తుందా.. అన్న సందేహం చాలా మందిలో ప్రారంభమవుతోంది. అందుకే ఏపీ సర్కార్ మరింత గట్టిగా వ్యవహరించాల్సిన సందర్భం వచ్చిందంటున్నారు.
కొసమెరుపేమిటంటే… గోదావరి మిగులు జలాలను సీమకు తీసుకెళ్లాలని సలహా ఇచ్చిన కేసీఆర్… గోదావరిలో నికర జలాలే కాకుండా మరో 650 టీఎంసీల మిగులు జలాల హక్కులు తెలంగాణకు ఉన్నాయని చెప్పుకోవడం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close