సుజనా బ్యాంకులకు రూ. 5,700 కోట్లు ఎగ్గొట్టారంటున్న ఈడీ..!

తెలుగుదేశం పార్టీ ఎంపీ సుజనా చౌదరికి చెందిన కంపెనీలు బ్యాంకులకు ఏకంగా రూ. 5,700 కోట్లు ఎగ్గొట్టాయని.. ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ వర్గాలు.. మీడియాకు సమాచారం అందించాయి. నెలలో రెండు సార్లు ఆయనకు చెందిన కంపెనీల్లో ఈడీ అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. హైదరాబాద్‌, దిల్లీలోని ఆయన నివాసాలు, కార్యాలయాల్లో ఈ రోజు సోదాలు చేసిన ఈడీ అధికారులు ఈ మేరకు ఆయనకు నోటీసులు జారీచేశారు. సుజనా ఆధీనంలోని 120 డొల్ల కంపెనీలు ఉన్నట్టు ఈడీ వెల్లడించింది. సుజనా చౌదరికి చెందిన ఆరు ఖరీదైన కార్లను ఈడీ జప్తు చేసింది. అప్పులిచ్చిన బ్యాంకుల ఫిర్యాదు మేరకే చర్యలు తీసుకున్నామని ఈడీ వర్గాలంటున్నాయి.

తెలుగుదేశం పార్టీ నేతల మాత్రం కావాలనే టార్గెట్ చేసి… సుజనా చౌదరిపై దాడులు చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి. నిజానికి సుజనా చౌదరి కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే కొన్ని వివాదాలు చుట్టుముట్టాయి. మారిషస్ బ్యాంక్ ఒకటి సుజనా కంపెనీలపై దావా వేసింది. ఆ తర్వాత సుజనా చౌదరి కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయన్న విషయాన్ని అంగీకరించారు. పార్టీ నిర్ణయం మేరకు.. కేంద్ర మంత్రి పదవి నుంచి వైదొలిగిన తర్వాత ఆయన లో ప్రోఫైల్ మెయిన్ టెయిన్ చేస్తున్నారు. ఆ సమయంలో ఆయన బీజేపీలో చేరుతారన్న ప్రచారం కూడా జరిగింది. అప్పుడు… పెద్దగా.. దృష్టి పెట్టని ఈడీ ఇప్పుడు.. ఒక్కసారిగా దాడులకు చేస్తోంది. అయితే ఏకంగా రూ. 5,700 కోట్లు ఎగవేస్తే. ఇంత సాదాసీదాగా దాడులు చేసి.. సమన్లు ఇచ్చి ఊరుకుంటారా.. అన్న సందేహాలు ఆర్థిక వర్గాల్లో ఉన్నాయి

ఈడీ వర్గాలు మీడియాకు అందించిన సమాచారాన్ని సుజనా గ్రూప్ ఖండించింది. తమ డైరెక్టర్లకు లుకౌట్‌ నోటీసులు జారీ చేశారన్నదిదుష్ప్రచారమేనని, ఆ ఆరోపణల్ని ఖండిస్తున్నట్టు తెలిపింది. పదేళ్ల నాటి ఓ శోధనలో భాగంగా చెన్నై నుంచి ఈడీ అధికారులు వచ్చారని, వారికి అవసరమైన సమాచారం అందించినట్టు సుజనా గ్రూప్‌ స్పష్టం చేసింది. ఇరవై ఏడో తేదీన ఈడీ ముందు సుజనా చౌదరి హాజరైన తర్వాత అసలు వ్యవహారం బయటకు వచ్చే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ధోనీ… ఆ మెరుపులు మ‌ళ్లీ!

కెరీర్ తొలి రోజుల్లో ధోనీ చాలా ధాటిగా ఆడేవాడు. త‌ను ఆడిన తుపాను ఇన్నింగ్సులు ఎన్నో. ఆ దూకుడు చూసే అత‌న్ని అభిమానించ‌డం మొద‌లెట్టారు. సీనియారిటీ పెరిగేకొద్దీ, త‌న వికెట్ ఎంత విలువైన‌దో...

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

కెలికి మరీ తిట్టించుకోవడం ఇదే-వైసీపీకి షర్మిల అదిరిపోయే కౌంటర్..!!

ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ రెడ్డికి తన చెల్లి షర్మిల పంటికింది రాయిలా మారింది. అన్న వైఫల్యాలను చాటింపు వేస్తూనే.. ప్రభుత్వ అసమర్ధత, మంత్రుల దోపిడీ, వివేకా హత్యకేసుపై దూకుడుగా మాట్లాడుతోంది....

కడప కోర్టు తీర్పుపై న్యాయవర్గాల్లో విస్మయం !

వివేకా హత్య కేసులో మాట్లాడుతున్నారని ఎవరూ మాట్లాడవద్దని ఆర్డర్స్ ఇవ్వాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోర్టుకెళ్లారు. కోర్టు అయన కోరినట్లుగా ఎవరూ మాట్లాడవద్దని ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాలు... అందులో ఉన్న పదజాలం చూసి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close