ఒక్క కేసీఆర్ మాటలే వినిపించాయా – అదీ నెల తర్వాత !

కేసీఆర్‌ ప్రచారంపై ఈసీ రెండు రోజులు బ్యాన్ చేయడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అన్ని పార్టీల నేతల్లోనూ కేసీఆర్ మాటల్ని ఈసీ ఇంత సీరియస్ గా తీసుకుందా అన్న డౌట్ కు వస్తున్నారు. ఎందుకంటే ఆయన మాట్లాడింది ఇప్పుడు కాదు..దాదాపుగా నెల కిందట సిరిసిల్లలో. ఆ సభలో కాంగ్రెస్ పై ఆయన నోటి నుంచి అసువుగా వచ్చే లత్కోరు వంటి పదాల భాష ఉంది. దానిపైనా ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. తర్వాత మర్చిపోయారు. కానీ హఠాత్తుగా కేసీఆర్ ప్రచారంపై రెండు రోజుల బ్యాన్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

ఈ ఉత్తర్వులు కాంగ్రెస్ నేతల్లోనూ ఆశ్చర్యానికి గురి చేశాయి. ఆయన ప్రచారాన్ని హఠాత్తుగా రెండు రోజులు ఆపాల్సిన అవసరం ఈసీకేమిటని అనుకున్నారు. బీజేపీలోనూ అదే భావన కనిపించింది. ఆయన బస్సు యాత్ర ఆయన చేసుకుంటున్నాడు.. ఇప్పుడు గొంతు నొక్కేశామని పేరు ఒకటా అని కంగారు పడుతున్నారు. కేసీఆర్ ప్రచారం చేయడం కన్నా.. ఈ అంశాన్నే ఎక్కువగా ప్రచారం చేయాలని బీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నారు. నిజానికి కేసీఆర్ ఎప్పుడూ మాట్లాడే మాటలే మాట్లాడారు. వెంటనే కొండా సురేఖకు ఇచ్చినట్లుగా హెచ్చరికలో.. చర్యలో తీసుకుని ఉంటే సమస్య ఉండేది కాదు. కానీ అందరూ అలాంటి మాటలు మాట్లాడిన తర్వాత ఆయన ఒక్కరిపై చర్య తీసుకోవడమే వివాదాస్పమవుతోంది.

జాతీయ స్థాయిలో మోదీ ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా నేరుగా ముస్లింల ప్రస్తావన తీసుకు వచ్చి ప్రసంగిస్తున్నారు. ప్రతీ చోటా అదే పరిస్థితి. ఆయనతో పాటు రాహుల్ కు కూడా ఈసీ నోటీసులు జారీ చేసింది. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ముఖ్య నేతల్లో ఒక్క కేసీఆర్ పై మాత్రమే రెండురోజు బ్యాన్ వేశారు. అందరిపై చర్యలు ఒకేలా ఉంటే అందరూ పద్దతిగా ఉంటారు.ఇలా కాకుండా సెలక్టివ్ గా ఈసీ నిబంధనలు అమలు చేస్తే.. విమర్శలే వస్తాయి. ఇప్పుడు అదే జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

బ్యాక్ టు బెంగళూరు

వైఎస్ జగన్ మళ్లీ సతీసమేతంగా బెంగళూరు వెళ్లిపోయారు. మళ్లీ ఏదైనా హత్య లేదా మృతదేహం రాజకీయం చేయడానికి ఉపయోగపడుతుందనుకుంటే వస్తారేమో కానీ.. ఎప్పుడొస్తారో తెలియదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వినుకొండలో రషీద్ అనే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close