ఏపీ సెక్రటేరియట్‌లో ఉద్యోగ సంఘ నేతల ధర్నా !

పీఆర్సీ నివేదికను బహిరంగపరిచే వరకూ కదలబోమంటూ ఏపీ సచివాలయంలో ఉద్యోగ సంఘ నేతలు భైఠాయించారు. అయితే వారు లోపల కాకుండా రెండో బ్లాక్ ముందు ఉన్నరోడ్డుపై కూర్చున్నారు. ఈ రోజు పీఆర్సీ నివేదిను వెల్లడిస్తామన్నారని.. అది వెల్లడించే వరకూ తాము వెళ్లబోమన్నారు. అయితే వారికి సమాధానం చెప్పడానికి ఉన్నతాధికారులు ఎవరూ సచివాలయంలో లేరు. చీఫ్ సెక్రటరీ కూడా లేరు. ఉద్యోగ సంఘాల నేతల ఆందోళన గురించి తెలిసిన సీఎస్ సమీర్ శర్మ.. పీఆర్సీ నివేదిను బహిరంగ పరిచేందుకు అనుమతి కోసం… ముఖ్యమమంత్రి క్యాంపుఆఫీస్ కు వెళ్లారు.

సచివాలయంలో బైఠాయించిన వారిలో బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావు వంటివారు ఉన్నారు. వారందర్నీ వెళ్లిపోవాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారు అయితే వారు మాత్రం అక్కడి నుంచి కదలబోమని అంటున్నారు. గత నెలలో ఓ సారి ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అక్టోబర్ నెలాఖరు కల్లా పీఆర్సీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. కానీ అలాంటి ప్రయత్నం ఏదీ చేయలేదు. దీంతో వారు ధర్నాకు దిగారు.

వీరు ఇలా ధర్నాకు దిగడానికి ముందే ఈ ఉద్యోగ సంఘాలకు వ్యతిరేకంగా ఉండే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. తమ జీపీఎఫ్ నిధులు కూడా ఇవ్వడం లేదని.. ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం చంద్రశేఖర్ రెడ్డి అనే మాజీ ఎన్జీవో నేతకు పదవి ఇవ్వడంపై ఆయన మండిపడ్డారు. ఆయనపై చాలా అక్రమాల ఆరోపణలు ఉన్నాయన్నారు. ఇలా ఉద్యోగ సంఘాల నేతలు పోటీపడి ప్రభుత్వంపై విమర్శలకు ముందుకు వస్తున్నారు. తాము ప్రభుత్వంతో కుమ్మక్కు కాలేదని ఉద్యోగులను నమ్మించడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close