ఏపీ పీసీసీ చీఫ్‌గా కిరణ్ కుమార్ రెడ్డి !

ఆంధ్రప్రదేశ్‌లోనూ కాంగ్రెస్ పార్టీకి కాస్త జవసత్వాలు కల్పించేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడ శైలజానాథ్ పదవి కాలం ముగియడంతో కొత్త పీసీసీ చీఫ్‌ను నియమించాలని నిర్మయించారు. ఈ క్రమంలో సోనియా, రాహుల్ లకు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డే కనిపిస్తున్నారు. ఆయనను ఢిల్లీ పిలిపించారు. ఆయనతో మాట్లాడి అధికారంగా టీ పీసీసీ చీఫ్‌గా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో రఘువీరా.. ఆ తర్వాత శైలజానాథ్ పీసీసీ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నా.. కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. కొన్ని ప్రెస్ మీట్లు తప్ప ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేకపోయారు.

కొత్త పీసీసీ చీఫ్‌గా ఓ రేంజ్ ఉన్న నేతను పెడితే… కాస్త హైప్ వస్తుందని హైకమాండ్ భావిస్తోంది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేసి.. జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టి.. ఫెయిలయి.. మళ్లీ కాంగ్రెస్‌లో చేరిన.. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఏపీ కాంగ్రెస్‌లో ఉన్న టాల్ లీడర్. ఆయనను పెడితే ఎలా ఉంటుందా.. అని మేథోమథనం చేస్తోంది హైకమాండ్. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పీసీసీ చీఫ్ పోస్ట్ తీసుకోవాలా వద్దా అన్నదానిపై కిరణ్ కుమార్ రెడ్డి ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది . కాంగ్రెస్‌లో ఉన్నప్పటికీ ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్‌గా లేరు.

ఢిల్లీ స్థాయిలో పార్టీకి తెర వెనుక సేవలు అందిస్తున్నారని చెబుతున్నారు. ఇప్పుడు ఆయనను పీసీసీ చీఫ్‌గా పంపితే.. కదలిక వస్తుందని.. పార్టీ క్యాడర్ కొంత మరే వైసీపీ నుంచి వెనక్కి వస్తుందన్న అంచనాలో హైకమాండ్ ఉంది. కిరణ్ కుమార్ రెడ్డిని ఒప్పించి పీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగించాలన్న ఆలోచనలో ఉన్నారు. ఆయన అంగీకరిస్తే.. ఏపీసీసీకి కూడా కాస్త యాక్టివ్‌గా ఉండేనేత దొరుకుతారు. కష్టపడితే బలపడే అవకాశం కూడా ఉంటుంది. కిరణ అంగీకరిస్తే ఏపీకి ఇక పీసీసీ చీఫ్‌గా ఆయనే ఉంటారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కోమ‌టిరెడ్డిలో మ‌రో కోణం… కొడుకు పేరుతో సేవ!

నిత్యం ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు... వేలాది మంది కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు.. హ‌డావిడి. వైఎస్ హాయం నుండి వేగంగా ఎదిగిన మంత్రి కోమటిరెడ్డి, సేవా కార్య‌క్ర‌మాల్లోనూ నేనున్నా అని అండ‌గా ఉంటారు. ముఖ్యంగా కోమ‌టిరెడ్డి కుమార్...

పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా వెంకటేష్ నేత..?

తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాలపై కన్నేసిన బీజేపీ ప్రచారంలో వెనకబడిన అభ్యర్థులను మార్చాలని నిర్ణయం తీసుకోనుందా..? సర్వేలతో ఎప్పటికప్పుడు రాష్ట్రంలో పరిస్థితిని తెలుసుకుంటున్న జాతీయ నాయకత్వం పెద్దపల్లి లోక్ సభ అభ్యర్థిని మార్చనుందా..?...

మూడు రోజులు బయటకు రాకండి… వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!

తెలుగు రాష్ట్రాల్లో భానుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. రానున్న మరో మూడు రోజులపాటు 3 నుంచి 5 డిగ్రీల సెంటిగ్రేడ్ ల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ...

నా కొడుకును ఉరి తీయండి… మాజీ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణ‌లోనే సంచ‌ల‌నం సృష్టిస్తున్న బీఆర్ఎస్ నేత‌, మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ కొడుకు హిట్ అండ్ ర‌న్ కేసుల‌పై ష‌కీల్ స్పందించారు. ఓ కేసులో బెయిల్ రాగానే మ‌రో కేసు తెర‌పైకి తీసుక‌రావ‌టం వెనుక...

HOT NEWS

css.php
[X] Close
[X] Close