పేదవాడి ఖాతాలోనే అప్పులు, అక్రమాలు !

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసినా పేదవాడిని కారణంగా చూపించడం చాలా రోజుల కిందటే ప్రారంభించింది. చివరికి టిక్కెట్ రేట్లు పేదవాడికి అందుబాటులో ఉండొద్దా లాంటి డైలాగుల్ని.. సినీ టిక్కెట్ల రాజకీయాల కోసం వాడుకున్నారు. ఇప్పుడు ఆర్థిక అక్రమాల దగ్గరకు వచ్చే సరికి మళ్లీ పేదవాడిని పైకి తీసుకు వస్తోంది ఏపీ ప్రభుత్వం. కాగ్ అడుగుతున్న లెక్కలు చెప్పలేక.. ఆ అక్రమాలను ప్రశ్నిస్తున్న టీడీపీ నేతలకు సమాధానం చెప్పలేక ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇప్పుడు అంతా పేదవాడి కోసం చేశామనే తెరపైకి తీసుకు వస్తున్నారు.

వచ్చే ఏడాది అప్పుల కోసం ఇప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తూ ఢిల్లీలోనే మకాం వేసిన ఆయన.. రూ. 48వేలకోట్ల గోల్‌మాల్‌పై వస్తున్న ఆరోపణల గురించి సమాధానం ఇచ్చుకోవడానికి ప్రెస్ మీట్ పెట్టారు. పేదల కోసం అప్పులు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. పేదల కోసం అప్పులు చేసి పంచి పెడుతూంటే.. అక్రమాలని టీడీపీ నేతలు నిందలు వేస్తున్నారని ఆరోపించారు. బుగ్గన వాదన ఎవరికైనా విచిత్రంగా అనిపించడం ఖాయం. అప్పులు చేయడం మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆ అప్పుల డబ్బులను ఎలా ఖర్చు చేశారు… ఎవరికి చెల్లించారన్న లెక్కలేకపోవడమే ఇప్పుడు తెలియాల్సి ఉంది. వాటికి తాముకాగ్‌కు చెప్పామని.. మరొకటని వాదిస్తూ.. పేదవాడిని తెరపైకి తెస్తున్నారు.

ఏపీ ప్రభుత్వం … ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్నట్లుగా వ్యవహరించడం లేదు. సొంత వ్యాపార సంస్థను నడుపుతున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఏ మాత్రం బాధ్యత లేకుండా చేస్తున్నారు. సొంత డబ్బును తరలించినట్లుగా తరలిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం ఈ విషయంలో చేస్తున్న తప్పుల్ని కాగ్ ప్రశ్నిస్తోంది కానీ కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా ఈ ఆర్థిక అరాచకత్వం పెరుగుతూనే పోతోంది. చివరికి ఏపీ ఆర్థిక వ్యవస్థ పతనమైనా.. దానికి పేదవాడినే కారణంగా చూపిస్తారేమో ..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘మిరాయ్‌’… 20 రోజుల్లోనే ఇంత తీశారా?

https://www.youtube.com/watch?v=xnubQ829q0c తేజ స‌జ్జా, కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి 'మిరాయ్‌' అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు తెలుగు 360 ముందే చెప్పింది. ఇప్పుడు అదే...

కోమ‌టిరెడ్డిలో మ‌రో కోణం… కొడుకు పేరుతో సేవ!

నిత్యం ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు... వేలాది మంది కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు.. హ‌డావిడి. వైఎస్ హాయం నుండి వేగంగా ఎదిగిన మంత్రి కోమటిరెడ్డి, సేవా కార్య‌క్ర‌మాల్లోనూ నేనున్నా అని అండ‌గా ఉంటారు. ముఖ్యంగా కోమ‌టిరెడ్డి కుమార్...

పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా వెంకటేష్ నేత..?

తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాలపై కన్నేసిన బీజేపీ ప్రచారంలో వెనకబడిన అభ్యర్థులను మార్చాలని నిర్ణయం తీసుకోనుందా..? సర్వేలతో ఎప్పటికప్పుడు రాష్ట్రంలో పరిస్థితిని తెలుసుకుంటున్న జాతీయ నాయకత్వం పెద్దపల్లి లోక్ సభ అభ్యర్థిని మార్చనుందా..?...

మూడు రోజులు బయటకు రాకండి… వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!

తెలుగు రాష్ట్రాల్లో భానుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. రానున్న మరో మూడు రోజులపాటు 3 నుంచి 5 డిగ్రీల సెంటిగ్రేడ్ ల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close