మంగళగిరిలో ఓటుకు నాలుగు వేలు..!?

కుప్పం.. మంగళగిరి.. పిఠాపురం.. ఈ మూడు నియోజకవర్గాలపై వైసీపీ ప్రధానంగా ఫోకస్ చేస్తోంది. కారణం అక్కడ చంద్రబాబు, లోకేష్ , పవన్ కళ్యాణ్ లు పోటీ చేస్తుండటమే. దీంతో వారిని ఎలాగైనా ఓడించాలని పట్టుదలతో ఉంది వైసీపీ. ఇందుకోసం అప్పుడే ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం స్టార్ట్ చేశారన్న ప్రచారం జరుగుతోంది.

ఈ మూడు నియోజకవర్గాల్లో ఓటర్లను ఆకర్షించేందుకు వైసీపీ డబ్బు, మద్యం పంపిణీపై ఆధారపడినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకోసం ఓటర్ కు 4వేల చొప్పున పంపిణీ చేసేందుకు సరంజామాను రెడీ చేసుకున్నారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. స్థానిక కూటమి నేతలను సైతం డబ్బు ప్రలోభాలకు గురి చేస్తున్నారని వైసీపీపై విమర్శలు వస్తున్నాయి.

ముందుగా మంగళగిరిలో డబ్బు పంపిణీని వైసీపీ షురూ చేసిందనే టాక్ నడుస్తోంది. ఎక్కడ ఎలాగైనా గెలిచి తీరాలనే లక్ష్యంతో ఓటర్లు ఎంత అడిగితే అంత చేతుల్లో పెట్టేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇదే సమయంలో మంగళగిరిలో లోకేష్ ను గెలిపించుకునేందుకు టీడీపీ నేతలు కూడా పట్టుదలతో పని చేస్తున్నారు. ఎలాగైనా మంగళగిరిలో గెలిచి తీరాలన్న లక్ష్యంతో వైసీపీ ప్రజా వ్యతితేక విధానాలను వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ రెండు రోజుల్లో మద్యం, డబ్బు పంపిణీ మరింత పీక్స్ కు చేరుతుందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భార్యా బాధితులను కామెడీగానే చూస్తున్న సమాజం !

తన భార్య నుండి తనకు , తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకుంటూ ప్రెస్ మీట్ పెట్టారు. హైదరాబాద్ లో ఘటన...

అప్పుడే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోన్న వైసీపీ..!!

ఏపీలో వైసీపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఎన్నికల ఫలితాన్ని ముందుగానే పసిగట్టారో మరేమిటో, అప్పుడే ప్రతిపక్ష పాత్రకు అలవాటుపడుతున్నట్లు కనిపిస్తోంది. అతిశయోక్తి అనిపించినా ఆ పార్టీ నేతలు చేస్తోన్న వరుస వ్యాఖ్యలు...
video

‘గం గం గణేశా’ ట్రైలర్ : నవ్వించే దొంగ

https://www.youtube.com/watch?v=wBZ7EUIM7fY బేబీతో ఓ యూత్ ఫుల్ విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ ఇప్పుడు 'గం గం గణేశా' సినిమా తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఇదొక క్రైమ్ కామెడీ. తాజాగా ట్రైలర్ ని వదిలారు....

జగన్ ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేసిన వైవీ సుబ్బారెడ్డి

వైవీ సుబ్బారెడ్డి జగన్ రెండో ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేశారు. విశాఖలో ప్రమాణం చేస్తానని జగనే ప్రకటించారు కాబట్టి ఎక్కడ అనే సందేహం లేదు. తొమ్మిదో తేదీన ప్రమాణం చేస్తారని బొత్స సత్యనారాయణ ఇంతకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close