విభజన సమస్యలపై నేడు గవర్నర్ “తీర్పు”..!?

విభజన సమస్యల పరిష్కారానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చురుకుగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగాయి. తుది చర్చలను గవర్నర్ సమక్షంలో జరుపబోతున్నారు. ఇప్పటి వరకూ జరిగిన చర్చల సారాంశాన్ని గవర్నర్ ముందు ఉంచనున్నారు. ఇరువురికి ఆమోదయోగ్యతను బట్టి గవర్నర్ తుది నిర్ణయం తీసుకుంటారు. ఉత్తర్వులు జారీ చేస్తారని చెబుతున్నారు.

వివాదాలపై నేడు గవర్నర్‌తో సీఎస్‌ల భేటీ..!

రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటి తర్వాత కొనసాగింపుగా అధికారులు వరుసగా మూడు రోజుల పాటు సమావేశం అయ్యారు. ఇరిగేషన్ అంశాలు,గోదావరి నీళ్లను కృష్ణా బెసిన్ లోని శ్రీశైలం ప్రాజెక్ట్ కు తరలించే విషయంపైన చర్చించారు. దీంతో పాటు విభజన సమస్యల్లోని 9,10 షెడ్యూళ్లు,ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల పంపిణీ తదితర అంశాలతో పాటు ఢిల్లీలోని ఏపీ భవన్‌ విభజనపై ప్రధానంగా చర్చ జరిగింది. 9వ షెడ్యూలులో 91 సంస్థలు, 10వ షెడ్యూలులో 142 విశ్వవిద్యాలయాలు, విద్య, శిక్షణ సంస్థలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9, 10 షెడ్యూల్‌ సంస్థలు ఎక్కడ ఉంటే ఆ రాష్ట్రానికే చెందాలని తెలంగాణ కోరుతోంది. ఉన్నత విద్యామండలి విషయంలో.. జనాభా ప్రాతిపదికన పంచాలని.. కోర్టు ఆదేశించింది. అదే సూత్రాన్ని అన్నిటికీ వర్తింపచేయాలని… ఏపీ డిమాండ్ చేస్తోంది.

ఎవరికి న్యాయం..? ఎవరికి అన్యాయం..?

అయితే 9వ షెడ్యూలు కింద ఉన్న సంస్థల భవనాలు .. ఎక్కడ ఉన్న అక్కడే అన్న విధంగా పంచుకోవాలని తెలంగాణా అభిప్రాయపడుతోంది..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి అంగీకరించడం లేదు.. ఇరు రాష్ట్రాల అధికారులు..9వ షెడ్యూలు కింద ఉన్న 91 సంస్థల్లో 40 సంస్థలకు సంబంధించి ఎలాంటి వివాదాలు లేవని తెలిసింది. వీటిపై వెంటనే నిర్ణయం తీసుకోనున్నారు. బీసీ సంక్షేమ శాఖ కింద ఉన్న వడ్డెర, రజక, కుమ్మరి, బలిజ వంటి సమాఖ్యలు, మీట్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌, సీడ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌, ఓవర్సీస్‌ మ్యాన్‌ పవర్‌, ప్రాపర్టీ ట్యాక్స్‌ బోర్డు వంటివాటికి పౌర సరఫరాల సంస్థకు సంబంధించి రూ.1700 కోట్లను తమకు ఇవ్వాల్సి ఉందని ఆంధ్రప్రదేశ్‌ అధికారులు తెలిపారు. అయితే ఇది వాస్తవం కాదని, కేవలం 600 కోట్ల వరకు మాత్రమే ఉన్నాయని తెలంగాణ అధికారులు చెప్పినట్లుగా తెలిసింది.. ఇలాంటి నిధుల వ్యవహారాలను సీఎంల దృష్టికి తీసుకెళదామని ఇరు ఏకాభిప్రాయానికి వచ్చినట్లుగా సెక్రటేరియట్ లో ని అధికారులు తెలిపారు.

విద్యుత్ బకాయిలు ఇప్పిస్తారా..?

తెలంగాణ కు చెందిన సుమారు 800 మంది నాలుగో తరగతి ఉద్యోగులు అమరావతిలో విధులు నిర్వహిస్తున్నారు…వీళ్లను తెలంగాణ కు తీసుకువచ్చే అంశంపై చర్చించనున్నారు. దీంతో పాటు ఏపికి చెందిన 24 మంది సెక్షన్ ఆఫీసర్లు కూడా తెలంగాణ సెక్రటేరియట్ లో పని చేస్తున్నారు. వారిని ఏపీకి కేటాయించడంపై చర్చించనున్నారు. విద్యుత్ సంస్థల సమస్యలపై కూడా గవర్నర్ సమక్షంలో చర్చించే అవకాశం ఉంది..1157 మంది ఏపి స్థానికత ఉద్యోగుల సమస్యపై సుప్రీంకోర్టులో కేసు కొనసాగుతోంది..వీరిని ఏపీ తీసుకోవాలని తెలంగాణా కోరుతోంది..దీనికి ఏపీ ప్రభుత్వం అంగీకరించడం లేదు.. దీనికి పరిష్కార మార్గాలపై గవర్నర్ చర్చించే అవకాశం ఉంది..అంతేకాకుండా విద్యుత్ సంస్థలకు బకాయిల అంశాన్ని ఏపీ ప్రభుత్వం ప్రస్తావించే అవకాశముంది.

ఏపీ భవన్‌ తెలంగాణ ఖాతాలోకేనా..?

ప్రస్తుతం.. తెలంగాణ సర్కార్.. పట్టుదలను చూస్తూంటే.. ఢిల్లీలోని ఏపీ భవన్‌ను వదులుకోవడానికి సిద్దంగా లేదు. చట్టం ప్రకారం పంపకాలకు కూడారెడీగా లేదు. మొత్తం తనకివ్వాల్సిందేనని అంటోంది. ప్రత్యామ్నాయంగా.. ఎంతో కొంత పరిహారం గురించి ప్రస్తావిస్తున్నారు. లేకపోతే మరో చోట భవనం కట్టిస్తామంటున్నారు. దీనిపై.. ఏపీ అధికారులు… తీవ్రంగా పట్టుబట్టే పరిస్థితి లేదు. నష్టమైనా.. విభజన సమస్యల నుంచి త్వరగా బయటపడాలని.. సీఎం నేరుగా చెప్పడంతో.. అధికారులు కూడా.. ఏదైతే అది అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. మొత్తానికి గవర్నర్.. సమక్షంలో ఈ రోజు.. జరగబోయే చర్చల తర్వాత రాజ్‌భవన్ నుంచి కొన్ని అధికారిక ఉత్తర్వులు రావడం ఖాయంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

కెలికి మరీ తిట్టించుకోవడం ఇదే-వైసీపీకి షర్మిల అదిరిపోయే కౌంటర్..!!

ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ రెడ్డికి తన చెల్లి షర్మిల పంటికింది రాయిలా మారింది. అన్న వైఫల్యాలను చాటింపు వేస్తూనే.. ప్రభుత్వ అసమర్ధత, మంత్రుల దోపిడీ, వివేకా హత్యకేసుపై దూకుడుగా మాట్లాడుతోంది....

కడప కోర్టు తీర్పుపై న్యాయవర్గాల్లో విస్మయం !

వివేకా హత్య కేసులో మాట్లాడుతున్నారని ఎవరూ మాట్లాడవద్దని ఆర్డర్స్ ఇవ్వాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోర్టుకెళ్లారు. కోర్టు అయన కోరినట్లుగా ఎవరూ మాట్లాడవద్దని ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాలు... అందులో ఉన్న పదజాలం చూసి...

హ్యాపీ బర్త్ డే : ఏపీ నీడ్స్ చంద్రబాబు !

చంద్రబాబునాయుడు .. అభివృద్ధి రాజకీయాలు, యువతకు ఉపాధి, టెక్నాలజీ విషయాల్లో ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే అద్భుతాలు చేయవచ్చని నిరూపించిన నాయకుడు. ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు......

HOT NEWS

css.php
[X] Close
[X] Close