హైకోర్ట్ తుదితీర్పుపై బాధితుల హర్షం

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో సుమారు 40 లక్షలమందిని(32 లక్షలమంది కస్టమర్లు, 8 లక్షలమంది ఏజెంట్లు) ముంచేసి, పలువురు ఆత్మహత్య చేసుకోవటానికికూడా కారణమైన అగ్రిగోల్డ్ సంస్థ వ్యవహారంలో హైకోర్ట్ ఇవాళ తుదితీర్పు వెలువరించింది. సంస్థ ఆస్తుల అమ్మకంకోసం రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని కోర్ట్ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో జడ్జితోపాటు ఏపీ, తెలంగాణనుంచి ఒక్కొక్కరు సభ్యులుగా ఉంటారు. ముందు ప్రధానమైన 14 ఆస్తులను, రెండో విడతలో 5 ఆస్తులను విక్రయించాలని, ఆస్తుల వివరాలు ఈ నెల 26లోగా సమర్పించాలని ఆదేశించింది. ఆస్తుల విక్రయం ఈ-ఆక్షన్ విధానంలో జరగాలని, లావాదేవీలకోసం హైకోర్ట్ రిజిస్ట్రార్ పేరుతో ఎకౌంట్ తెరిచి దానిలో విక్రయించిన సొమ్మును వేయాలని సూచించింది. కోర్ట్ తీర్పుపై అగ్రిగోల్డ్ బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ నాటికి చెల్లింపులు ప్రారంభమవుతాయని బాధితులు ఆశిస్తున్నారు.

ఏపీ, తెలంగాణల్లో అగ్రిగోల్డ్‌కు ఆస్తులు ఉన్నాయి. హైదరాబాద్, ఇతర ప్రాంతాలలో 176 ఎకరాల స్థలం, విజయవాడలో 172 ఎకరాల స్థలం ఉంది. సంస్థకు చెందిన 300 ఆస్తుల జాబితాను హైకోర్ట్‌కు ఇప్పటికే సమర్పించటం జరిగింది. ఆస్తుల విక్రయం విషయంలో కమిటీకి సహకరించాలని, ఆస్తుల విషయంలో ఏదైనా తేడా వచ్చినా, ఇన్‌సైడ్ ట్రేడింగ్ చేసినా అగ్రిగోల్డ్ యాజమాన్యంపై కేసులు పెడతామని హైకోర్ట్ హెచ్చరించింది. రిటైర్డ్ జడ్జి పేరును ఈ నెల 12న ప్రకటించనున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close