రాష్ట్రపతి అభ్యర్థి ఎవరో విజయసాయిరెడ్డి చెప్పేశారా !?

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరు అభ్యర్థి అవుతారో ఎవరికీ తెలియదు. ఎవరు ఉపరాష్ట్రపతి అవుతారో కూడా ఎవరికీ తెలియదు. ఎంపిక చేయాల్సిన బీజేపీ పెద్దలకు మాత్రమే తెలుసు. అయితే వారితో పాటు వైసీపీ నేతలకూ తెలుస్తున్నాయి. విజయసాయిరెడ్డి ఈ విషయంలో చాలా దూకుడుగా ఉన్నారు. రెండు రోజుల క్రితం ఆయన ఢిల్లీలో దినేష్ త్రివేదీ అనే పెద్ద మనిషిని కలిశారు. ముందస్తుగా శుభాకాంక్షలు చెప్పారు. ఆయన కేంద్రమంత్రి కాదు.. కనీసం ఎంపీ కూడా కాదు. మరెందుకు కలిశారంటే ?.

విజయసాయిరెడ్డికి ఓ అలవాటు ఉంది. ఎవరైనా ఓ కీలకపదవిలోకి వెళ్లబోతున్నారని తెలిసిన మరుక్షణం.. ఖరీదైనగిఫ్టులు… శాలువాలూ… తిరుపతి ప్రసాదం వంటివి తీసుకుని వాళ్లింటికెళ్లిపోతారు. సన్మానంచేసి కాళ్లకు నమస్కారం పెట్టేస్తారు. తర్వాత ఎప్పుడు ఏ అవసరం వస్తుందని అనుకుంటారో ఏమో. అలా దినేష్ త్రివేదీ ఇంటికి కూడా వెళ్లారనితెలుస్తోంది. ఆయన పేరును రాష్ట్రపతి లేదా.. ఉపరాష్ట్రపతి పదవికి పరిశీలిస్తున్నారని.. దాదాపుగా ఖరారయిందని అందుకే విజయసాయిరెడ్డి ఫస్ట్ కర్చీఫ్ వేసి మరీ శుభాకాంక్షలు చెప్పారన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది.

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థులకు వైసీపీ తప్పని సరిగా మద్దతిస్తుంది. ఎలాంటి షరతులుపెట్టలేదు. పెట్టిన షరతులను ఇప్పటికే కేంద్రం ఆమోదించింది. ధర్మారెడ్డికి డిప్యూటేషన్ లాంటివి అవి పూర్తి చేసింది. అందుకే మాట వరుసకు అభ్యర్థులెవరో ఖరారు చేసుకుని వైసీపీ హైకమాండ్‌కు చెప్పిందని… అందుకేవారిని ప్రసన్నం చేసుకునేందుకు వైసీపీ పరుగులు పెడుతోందని అంటున్నారు. మొత్తానికి విజయసాయిరెడ్డి తమ చేష్టల ద్వారా తమకు చాలా పలుకుబడి ఉందని చెప్పడమే కాదు.. కాకా పట్టడంలోనూ తమను తీసి పడేసేవారు లేరని నిరూపిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంద్రానికి నిప్పెట్టిన దేవర

https://youtu.be/CKpbdCciELk?si=XoyRoPJZB05oVwwN ఎప్పుడెప్పుడా అని ఎన్టీఆర్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన ‘దేవర’ ఫియర్ సాంగ్‌ వచ్చేసింది. రేపు (మే 20).. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా టీమ్‌ తొలి పాటను విడుదల చేసింది. పేరుగా తగ్గట్టుగానే టెర్రిఫిక్...

చోరుడు రివ్యూ : అడవి దొంగ పాయింట్ బావుంది కానీ…

స్టార్ కంపోజర్ గా కొనసాగుతూనే మరోవైపు నటునలో కూడా బిజీగా వున్నారు జీవి ప్రకాష్ కుమార్. ఇటీవల ఆయన నుంచి వ‌చ్చిన‌ 'డియర్' సినిమా నిరాశపరిచింది. ఇప్పుడు ఆయన టైటిల్ రోల్ చేసిన...

అమెరికాలో వల్లభనేని వంశీ

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అమెరికా వెళ్లారు. పోలింగ్ అయిపోయిన తర్వాత చాలా మంది వెళ్లారు కానీ.. అందరూ తిరిగి వస్తారు.. కానీ వంశీ వస్తారా లేదా అన్నది మాత్రం...

ఫాక్స్ లింక్ పరిశ్రమ తిరుపతి నుంచి చెన్నైకి జంప్ !

యాపిల్‌కు విడిభాగాలు తయారు చేసి సప్లయ్ చేసే ఫాక్స్ లింక్స్ కంపెనీ ఏపీ నుంచి తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోయింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నారా లోకేష్ ఈ పరిశ్రమను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close