రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరు అభ్యర్థి అవుతారో ఎవరికీ తెలియదు. ఎవరు ఉపరాష్ట్రపతి అవుతారో కూడా ఎవరికీ తెలియదు. ఎంపిక చేయాల్సిన బీజేపీ పెద్దలకు మాత్రమే తెలుసు. అయితే వారితో పాటు వైసీపీ నేతలకూ తెలుస్తున్నాయి. విజయసాయిరెడ్డి ఈ విషయంలో చాలా దూకుడుగా ఉన్నారు. రెండు రోజుల క్రితం ఆయన ఢిల్లీలో దినేష్ త్రివేదీ అనే పెద్ద మనిషిని కలిశారు. ముందస్తుగా శుభాకాంక్షలు చెప్పారు. ఆయన కేంద్రమంత్రి కాదు.. కనీసం ఎంపీ కూడా కాదు. మరెందుకు కలిశారంటే ?.
విజయసాయిరెడ్డికి ఓ అలవాటు ఉంది. ఎవరైనా ఓ కీలకపదవిలోకి వెళ్లబోతున్నారని తెలిసిన మరుక్షణం.. ఖరీదైనగిఫ్టులు… శాలువాలూ… తిరుపతి ప్రసాదం వంటివి తీసుకుని వాళ్లింటికెళ్లిపోతారు. సన్మానంచేసి కాళ్లకు నమస్కారం పెట్టేస్తారు. తర్వాత ఎప్పుడు ఏ అవసరం వస్తుందని అనుకుంటారో ఏమో. అలా దినేష్ త్రివేదీ ఇంటికి కూడా వెళ్లారనితెలుస్తోంది. ఆయన పేరును రాష్ట్రపతి లేదా.. ఉపరాష్ట్రపతి పదవికి పరిశీలిస్తున్నారని.. దాదాపుగా ఖరారయిందని అందుకే విజయసాయిరెడ్డి ఫస్ట్ కర్చీఫ్ వేసి మరీ శుభాకాంక్షలు చెప్పారన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది.
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థులకు వైసీపీ తప్పని సరిగా మద్దతిస్తుంది. ఎలాంటి షరతులుపెట్టలేదు. పెట్టిన షరతులను ఇప్పటికే కేంద్రం ఆమోదించింది. ధర్మారెడ్డికి డిప్యూటేషన్ లాంటివి అవి పూర్తి చేసింది. అందుకే మాట వరుసకు అభ్యర్థులెవరో ఖరారు చేసుకుని వైసీపీ హైకమాండ్కు చెప్పిందని… అందుకేవారిని ప్రసన్నం చేసుకునేందుకు వైసీపీ పరుగులు పెడుతోందని అంటున్నారు. మొత్తానికి విజయసాయిరెడ్డి తమ చేష్టల ద్వారా తమకు చాలా పలుకుబడి ఉందని చెప్పడమే కాదు.. కాకా పట్టడంలోనూ తమను తీసి పడేసేవారు లేరని నిరూపిస్తున్నారు.