గుండ్లకమ్మ గేటు పెట్టడం చేతకాలేదు కానీ వెలిగొండ కట్టేశానంటే నమ్ముతారా !?

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాను అన్నీ చేశానని చెప్పుకోవడానికి తాపత్రయ పడుతున్నారు. పూర్తి కానీ.. పనులు జరగని.. కనీసం నీటి చెమ్మలేని ప్రాజెక్టుల్ని ప్రారంభిస్తూ.. నేనే నేనే చేశానంటున్నారు. తాజాగా వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించేశారు. అసలు ప్రాజెక్టే ఓ రూపానికి రాలేదు. చంద్రబాబు హయాంలో వేగంగా జరుగుతున్న పనుల్ని తాను రాగానే రివర్స్ టెండర్లేసి మేఘాకు అప్పగించారు. అప్పట్నుంచి యంత్రాలతో చేయాల్సిన పనుల్ని మనుషులతో చేయిస్తున్నారు.

ఇంకా రూ. నాలుగు వేల కోట్లకుపైగా విలువైన పనులు పెండింగ్ ఉన్నాయి. ప్రాజెక్టు ద్వారా .. సొరంగం ద్వారా కానీ ఒక్క లీటర్ నీళ్లు పంపింగ్ చేసే పరిస్థితి లేదు. అయినా ప్రాజెక్టు ప్రారంభించేసి గొప్పలు చెప్పుకున్నారు. తన తండ్రి శంకుస్థాపన చేస్తే తాను ప్రారంభించానన్నారు. కానీ మొదట దీనికి శంకుస్థాపన చేసింది చంద్రబాబు. ఆ తర్వాత పదేళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉంది. పూర్తి చేయలేదు. మళ్లీ చంద్రబాబు వచ్చాక పనులు పరుగులు పెట్టాయి. కానీ ఆయన ఓడిపోయాక.. జగన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో కొంత పని కూడాపూర్తి చేయలేదు. కానీ ప్రారంభించేశారు.

గుండ్ల కమ్మ ప్రాజెక్ట్ గేటు కొట్టుకుపోతే.. పెట్టించడం చేతకాలేదు. ఈ కారణంగా కొన్ని వేల మంది రైతులు నష్టపోయారు. అయినా పట్టించుకోలేదు. సొంత జిల్లాలో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోతే..టెండర్లు పిలిచి.. అస్మదీయుడికి అడ్వాన్సులు ఇచ్చారేమో కానీ.. పనులు మాత్రం ప్రారంభంకాలేదు. ఇలా చెప్పుకుటూ పోతే.. ఇరిగేషన్ డిపార్టుమెంట్ లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యం నిలువెత్తునా కనిపిస్తూ ఉంటుంది. ప్రారంభోత్సవాల పేరుతో హడావుడి చేసి .. ప్రజల్లో నవ్వుల పాలవుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close