“రోడ్” ఎక్కుతున్న జనసేన..!

రాజకీయంగా యాక్టివ్ కావడానికి జనసేన గట్టి ప్రయత్నం ప్రారంభించింది. ప్రభుత్వంపై నిలదీయడానికి సామాన్యులకు దగ్గరవడానికి రోడ్ల సమస్యపై పోరాడాలని నిర్ణయించుకుంది. ఏపీలో రెండు, మూడేళ్ల నుంచి రహదారుల నిర్వహణ లేదు. దాంతో మెజార్టీ రోడ్లు పాడైపోయాయి. ప్రభుత్వం బాగు చేయించడం లేదు. అప్పో సప్పో చేసి చేయిద్దామన్నా కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి. అందుకే ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెచ్చి రోడ్ల సమస్య పరిష్కారానికి బాటలు వేయాలన్న లక్ష్యంతో “జేఏస్పీ ఫర్ రోడ్స్” అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

గాంధీ జయంతి రోజు నుంచి గాంధీగిరి తరహాలో జనసేన పార్టీ ఉద్యమ కార్యాచరణ ఖరారు చేసుకుంది. గాంధీ జయంతి రోజున రాష్ట్ర వ్యాప్తంగా శ్రమదానం చేసి రోడ్లు బాగు చేయాలని నిర్ణయించుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా రెండు చోట్ల శ్రమదానంలో పాల్గొనే అవకాశం ఉంది. మూడు రోజుల పాటు జనసేన కార్యకర్తలందరూ రోడ్లపైనే ఉండాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల పరిస్థితిపై వీడియోలు తీసి మీడియా ద్వారా, సోషల్ మీడియలో పోస్ట్ చేయనున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి జేఎస్పీ ఫర్ ఏపీ రోడ్స్ అన్న పేరుతో హాష్ ట్యాగ్ పెట్టి పోస్ట్ చేయనున్నారు. .

రోడ్ల దుస్థితి గురించి జనసేన పార్టీ పూర్తి సమాచారం సేకరించింది. లక్షా ఇరవై ఆరు వేల కిలోమీటర్ల రోడ్లు పాడైపోయాయని జనసేన నేతలు చెబుతున్నారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. ప్రమాదాలు పెరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత జనసేన క్యాడర్‌లో కదలిక ఈ కార్యక్రమం ద్వారా వస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఇక ముందు కూడా అదే తరహాలో పోరాడాలని జనసేన నేతలు భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close