కాపు మహాసభలు : నాడు ( 1988 ) , నేడు (2016)

విజయవాడలో 1988 జులై 10న జరిగిన కాపునాడుకు, వచ్చే జనవరి 30న తూర్పు గోదావరి జిల్లా తునిలో జరగబోయే కాపు మహాసభకు సాపత్య, వ్యత్యాసాలేమిటి? కాపులందరినీ బీసీలలో చేర్చాలన్నది ఆనాటి కాపునాడు డిమాండ్లలో ఒకటి అయినప్పటికీ, ఆ సభ ప్రధానంగా నాటి ముఖ్యమంత్రి నియంతృత్వ పాలనను తీవ్రంగా విమర్శించింది. ఐదు లక్షల మంది హాజరైన ఆ సభలో ఎన్ టి ఆర్ పై నాయకులు తిట్ల వర్షం కురిపించారు. ఆనాటి సభ కాపుల రిజర్వేషన్లపై కాకుండా కమ్మ వ్యతిరేకతపై ఫోకస్ చేసింది. తెలుగుదేశం మహానాడుకు దీటుగా జరిగిన కాపునాడు ఎన్ టీ ఆర్ ను తీవ్ర కలవరానికి గురిచేసింది. ఆనాడు తనను పిలిచి ఆయన చాలా సేపు బాధ పడ్డారని కాపు నాయకుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ హరిరామ జోగయ్య ఇటీవల ఒక టీవీ కార్యక్రమంలో చెప్పారు. కాపు నాడు సభ జరిగినప్పుడు వంగవీటి మోహన రంగారావు జైలులో ఉన్నప్పటికీ ఆయనే అంతటి సభను విజయవంతంగా వెనుకనుండి నడిపించారు. ఆ తర్వాత రంగా హత్యకు గురికావడం, మరో కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం మంత్రి వర్గానికి రాజీనామా చేయడం జరిగిపోయాయి. నిజాయితీ పరుడైన మంత్రిని కోల్పోయానని ఎన్ టీ ఆర్ బాధ పడినట్టు వార్తలు వచ్చాయి.

ఇప్పుడు ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో కాపులు ర్యాలీ అవుతున్నారు. ఆయన నేతృత్వం లోనే తునిలో కాపు మహాసభ జరగబోతోంది. రంగాకు, ముద్రగడకు చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. రంగాకు నేర చరిత్ర ఉన్నా మాస్ లీడర్ గా ప్రజల మన్ననలు పొందారు. ఆయనకు ఓసీ కాపులతో పాటు బీసీ కాపులలో కూడా పలుకుబడి ఉండేది. విజయవాడలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ప్రభావం ఉండేది. కాపులలోనే కాకుండా బీసీ, ఎస్సీల ఆదరణ కూడా ఆయనకు లభించింది. ముద్రగడ పద్మనాభం ప్రభావం ప్రధానంగా ఓసీ కాపులకు, తూగో జిల్లాకు పరిమితంగా ఉన్నట్టు కన్పిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత ప్రధాన అంశంగా కాకుండా చంద్రబాబు పాదయాత్ర సమయంలోనూ, 2014 ఎన్నికల ప్రచార సభల్లోనూ కాపులకు ఇచ్చిన హామీలను అమలు చేయించుకోవడమే మహాసభ ఎజెండాగా ఉంది. కాపులను బీసీ ల్లో చేర్పించుకోవడం, వీరి సంక్షేమానికి ఏటా 1000 కోట్లరూపాయలు ఖర్చు చేయించుకోవడం తప్ప మరో డిమాండు లేదు. ఈ మహాసభలో ఉద్వేగభరితమైన అంశాలు పెద్దగా లేవు. అయినప్పటికీ ముద్రగడ వ్యక్తిత్వం ఇవి లేని లోటును తీర్చే అవకాశముంది.

ఉభయ గోదావరి జిల్లాల్లో కాపులకు, శెట్టి బలిజ (గౌడ్)లకు వైరం ఉంది. ఇతర బీసీ కులాలు కూడా కాపులతో అంతగా కలిసి ఉండరు. గత ఎన్నికల్లో యాదవ కులానికి చెందిన యనమల రామకృష్ణుడిని ఓడించడంలో కాపులు కీలక పాత్ర వహించారు. అయినా చంద్రబాబు నాయుడు యనమలను ఎమ్మెల్సీని, మంత్రిని చేసి కీలక స్థానంలో ఉంచారు. కాపుల కోసం సోమవారం యనమల ద్వారా ప్రకటించిన ప్యాకేజి వారిని సంతృప్తి పరిచేలా లేదు. తుని కాపు మహాసభ ఉభయ గోదావరి జిల్లాలకే పరిమితమయ్యేట్టు కన్పిస్తున్నా రాజకీయంగా ఈ మహాసభకు ప్రాధాన్యం ఉంటుంది. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ వల్లనే కాకుండా అనేక ఇతర కారణాల చేత ఎక్కువ శాతం కాపులు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచారు. కాపులకు వైఎస్ రాజశేఖర రెడ్డిపై ప్రత్యేక అభిమానం ఉన్నా వారు జగన్ పార్టీ వైపు అంతగా మొగ్గు చూపలేదు. తెలుగుదేశం ప్రభుత్వం మరో మెరుగైన ప్యాకేజిని ప్రకటించకపోతే ఓసీ కాపుల ఆలోచన ధోరణిలో మార్పులు రావచ్చని భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి…కవితకు బెయిల్ దక్కేనా..?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ అధికారుల వద్ద అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి తాజాగా సీబీఐ అధికారుల ముందు కూడా అప్రూవర్...

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close