ప్రాజెక్ట్ ‘కె’లో.. మ‌రో పార్ట‌న‌ర్‌?

ప్ర‌భాస్ – నాగ అశ్విన్ కాంబినేష‌న్‌లో `ప్రాజెక్ట్ కె` రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. అమితాబ్ బ‌చ్చ‌న్‌, దీపికా ప‌దుకొణె కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని వైజ‌యంతీ మూవీస్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోంది. దాదాపు రూ.500 కోట్ల బ‌డ్జెట్ అవ్వ‌బోతోంద‌ని టాక్‌. ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ సినిమాకి అశ్వ‌నీద‌త్ సోలో నిర్మాత‌. అయితే ఇప్పుడ ఈ ప్రాజెక్టులోకి క‌ర‌ణ్ జోహార్ కూడా ఎంట‌ర్ అవ్వ‌బోతున్న‌ట్టు టాక్. ఈ సినిమాలో క‌ర‌ణ్ నిర్మాణ భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నాడ‌ట‌. హిందీలో క‌ర‌ణ్ హ‌వా ఎక్కువ‌. బాహుబ‌లిని అక్క‌డ ప్ర‌మోట్ చేసింది క‌ర‌ణ్ జోహారే. ఇప్పుడు ఆర్‌.ఆర్‌.ఆర్‌లోనూ త‌న పాత్ర ఉంది. `లైగ‌ర్‌`లోనూ త‌ను పార్ట‌న‌ర్‌. తెలుగు సినిమాని హిందీలో రిలీజ్ చేయాలంటే క‌ర‌ణ్ అండ‌దండ‌లు కావాల‌ని మ‌న నిర్మాత‌లు భావిస్తున్నారు. పైగా క‌ర‌ణ్ కూడా ఈమ‌ధ్య తెలుగు సినిమాల‌పై గ‌ట్టిగా ఫోక‌స్ పెట్టాడు. త్వ‌ర‌లోనే ప్ర‌భాస్ – నాగ అశ్విన్ కాంబినేష‌న్‌లో క‌ర‌ణ్ ఓ భారీ బాలీవుడ్ చిత్రాన్ని రూపొందించాల‌ని చూస్తున్నాడ‌ని తెలుస్తోంది. అంత‌కంటే ముఖ్యంగా `ప్రాజెక్ట్ కె`లో వాటా తీసుకునే ఉద్దేశ్యాల్లో ఉన్నాడ‌ని, ప్ర‌స్తుతం అందుకు సంబంధించిన చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని టాక్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close