కోకాపేట భూములన్నీ ప్రభుత్వ పెద్దల సన్నిహితులకే దక్కాయా..!?

తెలంగాణ ప్రభుత్వం అత్యంత విలువైన కోకాపేట భూముల్ని వేలం వేసింది. రేటు కూడా అత్యధికంగా పలికింది. కోకాపేటలో 49.9 ఎకరాలు హెచ్‌ఎండీఏ వేలం వేసింది. గరిష్టంగా ఒక ఎకరాకు రూ.60.2 కోట్ల ధర పలికింది. రూ.31.2 కోట్లకు అత్యల్ప ధరకు హైమా డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎకరం భూమి కొనుగోలు చేసిది. వేలంపాటలో అత్యధిక ధర పెట్టిన కొనుగోలు చేసిన కంపెనీ ఆక్వా స్పేస్ డెవెలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ సంస్థ పదహారున్నర ఎకరాలను సొంతం చేసుకుంది. తర్వాత స్థానంలో రాజపుష్ప రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది. సత్యనారాయణరెడ్డి మన్నె దాదాపుగా ఎనిమిది ఎకరాలు సొంతం చేసుకున్నారు.

ప్రెస్టిజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీ ఏడున్నర ఎకరాలు.. ఇక శ్రీ చైతన్యకు చెందిన వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఏడున్నర ఎకరాలు కొనుగోలు చేసింది. హైమా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎకరం స్థలాన్ని దక్కించుకుంది. దాదాపుగా పదిహేడు ఎకరాలు కొన్న అక్వా స్పేస్ సంస్థ మైహోం గ్రూప్‌నకు చెందినది. ఎకరం కొన్న హైమా డెవలపర్స్ కూడా వారిదే. ఇక వ్యక్తిగత హోదాలో భూములు కొన్న సత్యనారాయణరెడ్డి మన్నె ..ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీ యజమాని. ఆయన కుటుంబసభ్యుడు టీఆర్ఎస్ ఎంపీగా ఉన్నారు. మొత్తంగా చూస్తే.. ఒకరిద్దరు తప్ప.. టీఆర్ఎస్ ప్రభుత్వంతో సన్నిహితంగా ఉండేవారికే భూములు దక్కాయి. అయితే.. ఇందులో అక్రమాలు జరిగినట్లుగా ఎలాంటి ఆరోపణలు రాలేదు. పెద్ద మొత్తంలోనే భూములపై రేట్లు వచ్చాయి.

ఎకరం అరవై కోట్లకుపైగావచ్చాయి. ఒక్క రోజులోనే నాలుగు వందల కోట్ల ఆదాయం వచ్చింది. భూముల వేలం పాట కొనసాగనుంది. మొత్తంగా ఐదు వేల కోట్లను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కొనుక్కునేవారు ప్రభుత్వ పెద‌్దల సన్నిహితులే అయినా… పద్దతిగా కొనుక్కుంటున్నారన్న అభిప్రాయం ఉంది. అయితే విమర్శలు మాత్రం సహజంగానే వస్తూంటాయి. శుక్రవారం ఖానామెట్‌లో వున్న 15 ఎకరాల భూమిని వేలం వేయనున్నారు. వీటిని కూడా మైహోంగ్రూప్‌నే అత్యధికంగా దక్కించుకునే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంద్రానికి నిప్పెట్టిన దేవర

https://youtu.be/CKpbdCciELk?si=XoyRoPJZB05oVwwN ఎప్పుడెప్పుడా అని ఎన్టీఆర్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన ‘దేవర’ ఫియర్ సాంగ్‌ వచ్చేసింది. రేపు (మే 20).. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా టీమ్‌ తొలి పాటను విడుదల చేసింది. పేరుగా తగ్గట్టుగానే టెర్రిఫిక్...

చోరుడు రివ్యూ : అడవి దొంగ పాయింట్ బావుంది కానీ…

స్టార్ కంపోజర్ గా కొనసాగుతూనే మరోవైపు నటునలో కూడా బిజీగా వున్నారు జీవి ప్రకాష్ కుమార్. ఇటీవల ఆయన నుంచి వ‌చ్చిన‌ 'డియర్' సినిమా నిరాశపరిచింది. ఇప్పుడు ఆయన టైటిల్ రోల్ చేసిన...

అమెరికాలో వల్లభనేని వంశీ

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అమెరికా వెళ్లారు. పోలింగ్ అయిపోయిన తర్వాత చాలా మంది వెళ్లారు కానీ.. అందరూ తిరిగి వస్తారు.. కానీ వంశీ వస్తారా లేదా అన్నది మాత్రం...

ఫాక్స్ లింక్ పరిశ్రమ తిరుపతి నుంచి చెన్నైకి జంప్ !

యాపిల్‌కు విడిభాగాలు తయారు చేసి సప్లయ్ చేసే ఫాక్స్ లింక్స్ కంపెనీ ఏపీ నుంచి తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోయింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నారా లోకేష్ ఈ పరిశ్రమను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close