ఇక హైదరాబాద్ టు ఏపీ ఎవరూ ఆపరు..!

పొరుగు రాష్ట్రాల్లో ఉండిపోయి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలనుకునే ఆంధ్రులకు ఇప్పటి వరకూ ఉన్న కష్టాలు తీరిపోనున్నాయి. రేపటి నుంచి కేంద్రం ఇచ్చిన లాక్ డౌన్ 5.0 రూల్స్ అమల్లోకి రానుండటంతో.. అంతర్రాష్ట్ర సరిహద్దులు ఎత్తేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకూ ఏపీ సర్కార్… స్పందన యాప్‌లో పేర్లను నమోదు చేసుకున్నవారికే పాసులు జారీ చేస్తోంది. రేపట్నుంచి అలాంటి అవసరం లేదు ఇక నుంచి నేరుగా.. వెళ్లిపోవచ్చు. తెలంగాణ-ఏపీ బోర్డర్‌ చెక్‌పోస్టు ఎత్తివేయనున్నారు. అదే సమయంలో.. ఆర్టీసీకి ఆదాయం పెంచేందుకు..ఏపీ సర్కార్..తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.అంతర్‌రాష్ట్ర బస్సు సర్వీసులను నడపాలని ప్రయత్నిస్తున్నారు. సోమవారం రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులకు కేంద్రం అనుమతి ఇచ్చింది. కానీ రాష్ట్రాలకే అంతిమ నిర్ణయం వదిలేసింది.

ఇప్పటికే ఏపీ నుంచి బస్సుల రాకపోకలపై ఒడిశా, తమిళనాడు.. కర్నాటక, తెలంగాణ ప్రభుత్వాలకు ఏపీ సీఎస్‌ నీలం సాహ్ని లేఖ రాశారు. కానీసీఎస్‌ లేఖలపై ఇప్పటివరకూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించలేదు. ప్రభుత్వాలు అనుమతి ఇస్తే బస్సులు ఇతర రాష్ట్రాలకు వెళ్లివస్తాయి. ముఖ్యంగా హైదరబాద్ నుంచి బస్సు సర్వీసుల కోసం పెద్ద ఎత్తున జనం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం సొంత వాహనం ఉన్న వారు మాత్రమే అటూ ఇటూ వెళ్లగలుగుతున్నారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అందుబాటులోకి రాలేదు.చాలా కొద్ది రైళ్లు మాత్రమే నడుపుతున్నారు.

ఈ క్రమంలో… తెలంగాణ సర్కార్ అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు అనుమతి ఇస్తే.. ఏపీ వాసులు పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. బోర్డర్ వద్ద చెక్ పోస్ట్ ఎత్తేస్తే.. ఓ పెద్ద సమస్య తీరిపోయినట్లు అవుతుంది వివిధ రకాలపనులపై ఏపీకి వెళ్లాలనుకునేవారికి. రాత్రికి రాత్రి ఏపీ సర్కార్ మనసు మార్చుకోకపోతే.. ఎలాంటి క్వారంటైన్ భయాలు లేకుండా అటూ ఇటూ తిరగడానికి అవకాశం ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close