దీదీ వర్సెస్ సువెందు : తాడో -పేడో పోరు అంటే నందిగ్రామ్‌దే..!

బెంగాల్‌లోని నందిగ్రామ్ అంటే.. ఇప్పటికీ భూపోరాటమే గుర్తుకు వస్తుంది. అక్కడ పెట్టాలనుకున్న టాటా నానో ఫ్యాక్టరీ భూసేకరణ వివాదం… పాలక పార్టీగా ఉన్న సీపీఎం పునాదుల్ని కదిలించేసింది. మమతా బెనర్జీకి పీటం అందించేలా చేసింది. ఇప్పుడు అదే నందిగ్రాం ఆమె పీఠాన్ని కదిలించేయబోతోందన్న అంచనాలు రావడంతో.. మమతా బెనర్జీ స్వయంగా రంగంలోకి దిగారు. నందిగ్రామ్‌కు వెళ్లి ఎన్నికల యుద్ధానికి సిద్ధమయ్యారు. తానే స్వయంగా నందిగ్రాం నుంచి పోటీ చేస్తున్నారు. రెండో చోట పోటీ చేయడం లేదు. గెలిస్తే.. తాను గెలిచినట్లు.. లేకపోతే.. మొత్తంగా ఓడిపోయినట్లు. విజయమో.. వీర స్వర్గమో తేల్చుకోవాలని… మమతా బెనర్జీ అలా డిసైడయినట్లుగా తేలుతోంది.

నందిగ్రాంలో సువేందు అధికారి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన తృణమూల్ తరపునే దాదాపుగా 90వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. నిన్నామొన్నటిదికా మమత కేబినెట్‌లో ఆయన మంత్రి కూడా. కానీ ఆయన ఇప్పుడు బీజేపీలో చేరిపోయారు. నందిగ్రాం బెల్ట్ మొత్తం ఆయనకు పట్టు ఉంది. ఒక వేళ ఆయనను అలా బీజేపీకి వదిలిస్తే.. ఆ బెల్ట్ మొత్తం… తృణమూల్‌కు ఓటమి ఎదురవుతుంది. ఆయనను ఎదిరిస్తేనే ప్రయోజనమని.. అదీ కూడా.. ఆయనకు ధీటైన నేత పోటీ పడాలని డిసైడయి… మమతా బెనర్జీ స్వయంగా ఆయనను ఎదుర్కోవాలని డిసైడయ్యారు. నందిగ్రాంలో అధికారి బ్రదర్స్‌కు పలుకుబడి ఉండొచ్చు అది… మమతా టీంలో సభ్యులుగానే వారికి వచ్చింది కానీ సొంతంగా కాదని.. నిరూపించాలని మమతా బెనర్జీ డిసైడయ్యారు.

ఈ ఎన్నికలు మమతా బెనర్జీకి తాడో పేడో అన్నట్లుగా మారాయి. అందుకే ఆమె తాను గెలిస్తే పార్టీ గెలుస్తుంది..లేకపోతే లేదన్నట్లుగా … తేల్చుకోవాలనుకుంటున్నారు. నందిగ్రాంలో సువేందు అధికారినే అభ్యర్థిగా బీజేపీ ఖరారు చేసింది. బెంగాల్‌లో ఇప్పుడు.. ఎక్కడ చూసినా తృణమూల్ వర్సెస్ తృణమూల్ అన్నట్లుగా పోరు సాగుతోంది. ఒక్క నందిగ్రాం మాత్రమే కాదు.. అనేకచోట్ల తృణమూల్ నేతలతో పోటీ పడుతోంది.. ఇటీవలి కాలంలో ఉద్యమంలా పోయి..బీ జేపీలో చేరిన తృణమూల్ నేతలే. చివరికి మమతా బెనర్జీపై పోటీ పడేది కూడా.. వలస నేతే. ఇది కూడా బెంగాల్ ఎన్నికల్లో చర్చనీయాంశం అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close