తుపాను ముప్పులో ఏపీ కోస్తా తీరం !

ఆంధ్రప్రదేశ్ తీరం చిగురుటాకులా వణికిపోతోంది. బంగాళాఖాతంలో అతి తీవ్ర తుపాను తీరం దిశగా వస్తోంది. దీనికి మించాంగ్ అని పేరు పెట్టారు. పేరు కాస్త వెటకారంగా ఉంది కానీ.. ఇది చేసే విధ్వంసం మాత్రం తీవ్రంగా ఉంది. ఇప్పటికే చెన్నైలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. తీరం దాటిదే బాపట్ల, మచిలీపట్నం మధ్య అని తేలడంతో విధ్వంసం ఖాయమన్న హెచ్చరికలు వస్తున్నాయి. ఇప్పటికే ఏపీ తీరం మొత్తం వర్షాలు పడుతున్నాయి. తీరం దాటే సమయంలో గాలులు వంద కిలోమీటర్ల పైనే ఉండవచ్చని వాతావరణ శాఖ చెబుతోంది.

ఇంత కాలం కరవుు కారణంగా అల్లాడిన రైతులు ఇప్పుడు అతి కష్టం మీద పండించుకున్న పంటకు .. తుపాను ముప్పు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఇటీవల వరకూ నాగార్జున సాగర్ పై డ్రామా క్రియేట్ చేసింది కానీ.. తుపాను జాగ్రత్తల విషయంలో దృష్టి పెట్టలేదు. దీంతో రైతులు పెద్ద ఎత్తున ధాన్యాన్ని పోగొట్టుకునే పరిస్థితి ఉంది. ఆరబెట్టిన ధానాన్ని నిల్వ చేసుకోవడానికి బస్తాలు.. టార్పాలిన్లు వంటివి కూడా సరఫరా చేయలేకపోతున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు.

ప్రభుత్వ వర్గాలు అప్రమత్తంగా ఉంటే కనీసం ప్రాణ నష్టం అయిన జరగకుండా చూసుకోవడానికి అవసరమైనంత సమయం లభించింది. కానీ ముప్పుతీవ్రతను తేలిగ్గా తీసుకుంటున్నారేమో కానీ.. ఎవరికి వారు హెచ్చరికలు జారీ చేసి ఊరుకుంటున్నారు. ప్రత్యేకమైన ముందు జాగ్రత్తలు తీసుకోవడం లేదు. తుపాను తీరం దాటిన తరవాత ఎలాంటి నష్టం జరగకుండా ఉండాలని ప్రజలు దేవుడ్ని వేడుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టెట్ నిర్వహణపై సస్పెన్స్

తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పై సస్పెన్స్ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెట్ పరీక్షను వాయిదా వేస్తారా..?షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా..?అని అభ్యర్థులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. టెట్ పరీక్షల...

సుకుమార్.. మీరు సూప‌రెహె..!

ఇండస్ట్రీలో డబ్బులు తేలిగ్గా ఇస్తారేమో కానీ క్రెడిట్లు ఇవ్వరు. ముఖ్యంగా రచయితలు ఈ విషయంలో అన్యాయమైపొతుంటారు. ఓ రైటర్ తో ట్రీట్మెంట్, డైలాగ్స్, స్క్రీన్ ప్లే.. ఇలా అన్నీ రాయించి, చివరికి ఆ...

జూన్ 27న ‘క‌ల్కి’

ప్ర‌భాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'క‌ల్కి' రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొంది. దీనిపై అతి త్వ‌ర‌లోనే నిర్మాత‌లు...

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close