2 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కు బోనస్ !

కాంగ్రెస్ పార్టీకి గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీలు బోనస్ గా లభించాయి. గతంలో కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ లను కేసీఆర్ సిఫారసు చేశారు. కానీ గవర్నర్ ఆమోదించలేదు. కానీ తర్వాత మరో పేర్లను కానీ.. వారి పేర్లను కానీ గవర్నర్‌కు పంపలేదు. దీంతో ఆ రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు ఖాళీగానే ఉన్నాయి. ఇప్పుడు వాటిని భర్తీ చేసుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీకి లభించింది.

ఎవరికైనా ఎమ్మెల్సీలు ఇచ్చి మంత్రి పదవుల్లోకి తీసుకోవాలనుకుంటే రేవంత్ రెడ్డి ఈ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా పదవి ఇచ్చే అవకాశం ఉంది. పదేళ్లుగా కాంగ్రెస్ నేతలకు పదవులు లేక ఇబ్బంది పడుతున్నారు. పార్టీనే నమ్ముకున్న వారికి రేవంత్ ఆ రెండు సీట్లను ఇచ్చే అవకాశం ఉంది. మంత్రి పదవుల విషయంలో ఇంకా ఎలాంటి చర్చలు లేకపోయినప్పటికీ… కోదండరాంను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేస్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా కాంగ్రెస్ లో జరుగుతోంది.

కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ పేర్లను గవర్నర్ ఆమోదించినట్లయితే ఎమ్మెల్సీలుగా ఆరేళ్లు ఉండేవారు. కానీ ఇప్పుడు వారికి మళ్లీ చాన్స్ రాదు. రాజకీయాల్లో దాసోజు శ్రవణ్ అత్యంత దురదృష్టవంతునిగా మారారు. ఏఐసీసీలో స్పోక్స్ పర్సన్ గా ఉన్నా.. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదనుకుని బీజేపీలో చేరారు. అక్కడ్నుంచి మునుగోడు ఉపఎన్నికల సమయంలో బీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోయింది. ఆయనకు ఏ పదవి దక్కే అవకాశం లేకుండా పోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close