ఒలింపిక్స్ : వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయికి రజతం..!

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ బోణి కొట్టింది. 49 కేజీల మహిళల వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను రజతం సాధించింది. మీరాబాయి ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌కు చెందిన వారు. స్నాచ్ విభాగంలో 87 కేజీలు, క్లీన్ అండ్ జర్క్ విభాగంలో 117కేజీల బరువును ఎత్తారు. టోటల్‌గా 202 బరువు ఎత్తి రెండో స్థానంలో నిలిచింది. దీంతో వెయిట్‌లిఫ్టింగ్‌లో కరణం మల్లీశ్వరి తర్వాత పతకం సాధించిన క్రీడాకారిణిగా మీరాబాయి రికార్డు సృష్టించింది. పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగి .. బెస్ట్ పెర్‌ఫార్మెన్స్ చేయడంతో ఫలితం దక్కింది.

2000లో సిడ్నీలో జరిగిన ఒలింపిక్స్‌లో కరణం మల్లీశ్వరి కాంస్య పతకం సాధించారు. ఆ ఒలింపిక్స్‌లో ఇండియాకు లభించిన పతకం అదొక్కటే. ఆ తర్వాత షూటింగ్ విభాగాల్లో ఎక్కువ పతకాలు లభించాయి. బాక్సింగ్, రెజ్లింగ్‌లోనూ కొన్ని పతకాలు లభించాయి. 2008లో బీజింగ్‌లో జరిగిన క్రీడల్లో… అభినవ్ భింద్రా షూటింగ్‌లో స్వర్ణపతకం సాధించారు. గత ఐదు ఒలింపిక్స్‌లలో భారత్‌కు లభించిన స్వర్ణ పతకం అదొక్కటే. ఇంత వరకూ మళ్లీ లభించలేదు. ఇప్పుడు మీరాబాయి.. స్వర్ణ పతకాన్ని కొద్దిలో మిస్సయ్యారు.

భారత్ తరపున వెళ్లిన వాళ్లలో ఈ సారి పెద్ద ఎత్తున ప్రతిభావంతులు ఉన్నారు. పతకాలు సాధించగలిగే సామర్థ్యం ఉన్న వాళ్లు ఉన్నారని భావిస్తున్నారు. ఒలింపిక్స్ ప్రారంభలోనే ఇండియాకు రజతం దక్కడం శుభారంభంగా భావిస్తున్నారు. గత రికార్డులను బద్దలు కొట్టి.. మరిన్ని పతకాలను భారత ఆటగాళ్లు తీసుకొస్తారని అంచనా వేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close