మోదీ నేరుగానే చెప్పారు… జగన్ పాటిస్తారా?

కరోనాపై ప్రధాని మోడీ సీఎంలతో జరిపిన సమీక్షలో హఠాత్తుగా మోదీ పెట్రో ధరల ప్రస్తావన తెచ్చారు. పెట్రోల్, డిజిల్ ధరల పెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వాల తీరే కారణం అని విమర్శించారు. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ తగ్గించడం లేదని అందుకే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయన్నారు. గత ఏడాది నవంబర్‌లో ఎక్సైజ్ ట్యాక్స్‌ను కేంద్రం తగ్గించినా ఇతర రాష్ట్రాలు తగ్గించలేదన్నారు. ముఖ్యమంత్రులతో కరోనా పరిస్థితులపై మోదీ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలోనే కీలక వ్యాఖ్యలు చేశారు.

మహారాష్ట్ర, బెంగాల్, తమిళనాడు, ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలువ్యాట్‌ను తగ్గిస్తే ప్రజలపై భారం తగ్గుతుందన్నారు. సమావేశంలోనే రాష్ట్రాలను పెట్రోల్, డీజిల్‌పై పన్నులు తగ్గించాలని మోడీ విజ్ఞప్తి చేశారు. కేంద్రం, రాష్ట్రాలు కలిసి చేస్తేనే ధరలు తగ్గుతాయన్నారు. సీఎంల సమావేశంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ భేటీకి బీజేపీయేతర ముఖ్యమంత్రులు చాలా తక్కువ మందే హాజరయ్యారు. ప్లీనరీ కారణంగా కేసీఆర్ హాజరు కాలేదు. కానీ జగన్ హాజరయ్యారు.

గత ఏడాది నవంబర్‌లో దీపావళి సందర్భంగా లీటర్‌పై రూ. పది తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత కొన్ని రాష్ట్రాలు తమ వంతుగా మరికొంత తగ్గించాయి. కానీ బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలు మాత్రం తగ్గించలేదు. దీంతో ఆయా రాష్ట్రాల్లో అత్యధిక రేట్లు ఉన్నాయి. దేశంలోనే ఏపీలో అత్యధిక రేట్లు ఉన్నాయి. సమావేశంలో నేరుగానే మోదీ చెప్పారు..మరి పెట్రోల్ డీజిల్ రేట్లు జగన్ తగ్గిస్తారో లేదో మరి !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బెంగళూరు రేవ్ పార్టీ…వారిని తప్పించే ప్రయత్నం జరుగుతోందా..?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్న సినీ, రాజకీయ ప్రముఖులను తప్పించే ప్రయత్నం జరుగుతుందా..? ఈ విషయంలో మొదట దూకుడుగానే స్పందించిన బెంగళూరు పోలీసులు ఆ తర్వాత సైలెంట్ కావడానికి...

గేమ్ ఛేంజ‌ర్‌లో ‘జ‌న‌సేన‌’?

రామ్ చ‌ర‌ణ్‌, శంక‌ర్ కాంబోలో రూపుదిద్దుకొంటున్న చిత్రం 'గేమ్ ఛేంజ‌ర్‌'. ఇదో పొలిటికల్ డ్రామా. ఇందులో రామ్ చ‌ర‌ణ్ తండ్రీ కొడుకులుగా క‌నిపించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఫ్లాష్ బ్యాక్‌లో తండ్రి పాత్ర‌కు రాజ‌కీయ...

తొలిసారి మీడియా ముందుకు ‘క‌ల్కి’

ఈ యేడాది విడుద‌ల కాబోతున్న అతి పెద్ద ప్రాజెక్టుల‌లో 'క‌ల్కి' ఒక‌టి. ఈ సినిమా కోసం ప్ర‌భాస్ అభిమానులే కాదు, యావ‌త్ సినీ లోకం ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది. అయితే ఈ చిత్రానికి...

పూరి… హీరోల లిస్టు స్ట్రాంగే!

త‌ర‌వాత ఎవ‌రితో సినిమా చేయాల‌న్న విష‌యంపై పూరి జ‌గ‌న్నాథ్ పెద్ద‌గా ఆలోచించ‌డు. ఎందుకంటే పూరి స్టామినా అలాంటిది. త‌ను ఫ్లాపుల్లో ఉన్నా ఎవ‌రికీ లొంగ‌డు, భ‌య‌ప‌డ‌డు. ఇండ‌స్ట్రీలో ఉన్న ఏ హీరోతో అయినా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close