ముఖ్యమంత్రి చంద్రబాబుకి ముద్రగడ డెడ్-లైన్

కాపులకు రిజర్వేషన్లు కోరుతూ ముద్రగడ పద్మనాభం తునిలో ప్రారంభించిన కాపు ఐక్య గర్జన సభ హిమాసాయుతంగా మారిన సంగతి తెలిసిందే. పరిస్థితులు అదుపు తప్పడంతో ఆయన రాస్తా రోకో పిలుపుని కొద్ది సేపటి క్రితం ఉపసంహరించుకోవడంతో జాతీయ రహదారిపై కిలోమీటర్ల పొడవునా నిలిచిపోయిన వాహనాలు మెల్లగా కదలడం మొదలయింది. రేపు సాయంత్రంలోగా కాపులకు రిజర్వేషన్లపై నిర్దిష్టమయిన ప్రకటన చేయకపోతే ఆమరణ నిరాహార దీక్షకు కూర్చొంటానని ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గడువు విధించారు.

ఆయన రాస్తా రోకో విరమించుకొన్నప్పటికీ ఇంకా రైల్ రోకో ని కొనసాగిస్తుండటంతో విశాఖ నుండి బయలుదేరవలసిన అనేక రైళ్ళను అధికారులు అక్కడే నిలిపివేశారు. అలాగే విజయవాడ నుంచి విశాఖకు రావలసిన రైళ్ళను కూడా నిలిపివేసి రైల్వే అధికారులు ముద్రగాడ పద్మనాభంతో చర్చలు జరుపుతున్నారు. పరిస్థితులు మళ్ళీ అదుపు తప్పకుండా నియంత్రించేందుకు సుమారు మూడు వేలమంది పోలీసులు తునికి చేరుకొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మంత్రులతో అత్యవసరంగా సమావేశమయ్యి తునిలో నెలకొన్న పరిస్థితులను సమీక్షిస్తున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తునిలో జరిగిన సంఘటనలు చాలా బాధాకరమని, కాపులకు రిజర్వేషన్లు కల్పించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. దాని కోసం ఉద్యమిస్తున్నవారు ఇకనయినా తమ ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేసారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

భీమవరం రివ్యూ : రౌడీ రాజకీయానికి గడ్డు కాలమే !

ఏపీలో వీఐపీ నియోజకవర్గాల్లో భీమవరం ఒకటి. పవన్ కల్యాణ్ ఇప్పుడు అక్కడ పోటీ చేయకపోయినా అంది దృష్టి ఈ నియోజకవర్గంపై ఉంది. తాను నామినేషన్ వేసినా పవనే అభ్యర్థి అని ...

కాంగ్రెస్‌తో కాదు రేవంత్ తోనే బీజేపీ, బీఆర్ఎస్ పోటీ !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కాకుండా రేవంత్ తో పోటీ పడుతున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏమీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close