తుని సంఘటనలపై నేడు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్

నిన్న తూర్పు గోదావరి జిల్లా తునిలో నిర్వహించిన కాపు ఐక్య గర్జన సభ అనంతరం జరిగిన హింసాత్మక సంఘటనలపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈరోజు మీడియా ముందుకువచ్చి మాట్లాడుతారు. కేరళలో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ నిన్న సాయంత్రం హైదరాబాద్ తిరిగివచ్చేరు. ఈరోజు ఉదయం 10.30 గంటలకు లేదా మధ్యాహ్నం 3.00 గంటలకు కానీ ఆయన మీడియాసమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతారని సమాచారం.

పవన్ కళ్యాణ్ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అవడంతో ఆయన మీడియా సమావేశానికి చాలా ప్రాధాన్యత ఉంది. పవన్ కళ్యాణ్ కి కుల ప్రస్తావన చేయడం ఇష్టం లేకపోయినప్పటికీ, తప్పనిసరి పరిస్థితులలో దాని గురించే ఇప్పుడు మాట్లాడవలసిన పరిస్థితి ఏర్పడింది. నిన్న తునిలో జరిగిన హింసాత్మక సంఘటనలను ఖండించిన తరువాత అటువంటి పరిస్థితులకు దారి తీసిన ఆ ఉద్యమాన్ని తక్షణమే నిలిపివేయమని కాపు సామాజిక వర్గ ప్రజలను కోరవచ్చును. ఆయన తెదేపాకు మిత్రపక్షంగా ఉన్నందున బహుశః ఈ సమస్యపై ప్రభుత్వ కోణంలో నుండి తన అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చును. ఈ ఉద్యమాన్ని తక్షణమే నిలిపివేయమని ఒకవేళ ఆయన పిలుపునిచ్చినా ఆయన అభిమానులు ఉద్యమం నుండి తప్పుకోవచ్చునేమో కానీ కాంగ్రెస్, వైకాపాలకు చెందినవారు యధావిధిగా కొనసాగించవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close