తూచ్.. ! దేశ వ్యాప్త ఎన్నార్సీ లేదన్న మోడీ..!

పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా రేగిన మంటలు.. దేశం మొత్తం విస్తరిస్తూండటంతో.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ… సంచలన ప్రకటన చేశారు. దేశం మొత్తం .. జాతీయ పౌర గణన పట్టిక రూపొందించాలన్న ఆలోచన లేనే లేదని.. అసలు అలాంటి చర్చ ప్రభుత్వంలో జరగలేదని ప్రకటించారు. ఢిల్లీలో రానున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ప్రారంభించిన నరేంద్రమోడీ… వేదికపై ఎన్నార్సీపై యూటర్న్ తీసుకున్నారు. ” 2014లో మొదట మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఎన్నడూ దేశవ్యాప్త ఎన్‌ఆర్‌సీపై చర్చ జరపలేదు. సుప్రీం కోర్టు ఉత్తర్వు కారణంగానే అసోంలో దాన్ని అమలు చేయాల్సి వచ్చింది…” అని వివరణ ఇచ్చారు. మోడీ ఇలా ఒక్క సారిగా ఎన్నార్సీపై యూటర్న్ తీసుకోవడం.. కలకలం రేపుతోంది.

ఈశాన్య రాష్ట్రమైన అసోంలో. … నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ సిటిజన్ షిప్‌ను రూపొందించారు. దీని వల్ల.. కొన్ని లక్షల మంది పౌరసత్వం కోల్పోయారు. వారందర్ని డిటెన్షన్ సెంటర్లలో పెట్టారు. ఇప్పుడు.. ఆ ఎన్నార్సీని దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ విషయాన్ని ప్రభుత్వం .. పదే పదే చెబుతోంది. అమిత్ షా పార్లమెంట్ లో కూడా ప్రకటించారు. దేశవ్యాప్తంగా అమలు చేస్తమని ప్రభుత్వం ఖరాఖండిగా చెప్పబట్టే.. ఇతర రాష్ట్రాల్లోనూ ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఇవి పెరిగి పెద్దవయ్యే వరకూ.. చూస్తూండిపోయిన.. కేంద్రం.. అదుపు చేయడం కష్టమని అనుకుందేమో కానీ…వెనక్కి తగ్గిట్లుగా ప్రకటనలు చేస్తోంది. అసలు అలాంటి ఆలోచనే లేదని.. మోడీ ప్రకటించడమే దీనికి కారణమంటున్నారు.

పౌరసత్వ బిల్లుపై ఆందోళనల్లో ఒక్క ముస్లింలు మాత్రమే పాల్గొనడం లేదు. వీటిపై హిందవులు కూడా.. ఆందోళనతో ఉన్నారు. తాము పౌరసత్వాన్ని నిరూపించుకోలేకపోతే.. తమను డిటెన్షన్ సెంటర్లలో పెడతారన్న భయమే దీనికి కారణం. దేశంలో.. చాలా మందికి… సరైన ధృవపత్రాలు ఉండవు. ఉన్నా.. దాచుకునేంత పరిస్థితులు… కోట్ల కుటుంబాలకు లేవు. పైగా.. రాజకీయం మొత్తం కమ్మేసిన పరిస్థితి. చట్టాలు.. గిట్టాలు.. ఏవైనా అధికారంలో ఉన్న వారు చెప్పినట్లు అమలు చేసే దుస్థితి ఉంది. అందుకే.. ప్రజల్లో.. ఆ ఎన్నార్సీ… పౌరసత్వ చట్ట సవరణ.. . సొంత దేశంలో పరాయి పౌరులుగా చూడటానికేనన్న అభిప్రాయం బలపడిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close