సవాలు మిథ్య, చేతులెత్తడం మిథ్య

ప్రతిపక్ష నేత జగన్‌ కేసులతో సంబంధం వున్న వ్యాపార వేత్తల పేర్లు ప్యారడైజ్‌ పేపర్లలో వున్నాయన్నది నిజం. దాని ఆధారంగా అధికార తెలుగుదేశం పార్టీ జగన్‌పై దాడి తీవ్రం చేయడం నిజం. అయితే గతంలో హెరిటేజ్‌ డైరెక్టర్‌ పేరు కూడా వచ్చిందని వారు ఎదురు దాడి చేయడమూ సహజమే. ఆ తర్వాత జగన్‌ తనపై ఆరోపణలు నిరూపించడానికి పదిహేను రోజుల సమయం ఇస్తున్నట్టు నిరూపిస్తే రాజకీయాల్లోంచి తప్పుకుంటానని సవాలు చేయడం కేవలం వ్యూహాత్మకమే. ఎందుకంటే లక్షల పత్రాలలో ప్రస్తావనకు వచ్చిన పేర్లు వందల సంఖ్యలో వున్నాయి. వాటిని పరిశీలించడానికే చాలా సమయం కావాలి. పైగా సిబిఐ కేసులు నడుస్తున్నప్పుడు ఇంత తొందరగా వాటిని అవుననీ కాదని చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వానికి చట్టబద్దత కూడా వుండదు. నిర్దోషిగా నిరూపించుకోవాల్సింది మీరేనని టిడిపి మంత్రులు ప్రకటనలు చేయడంతో వారు చేతులెత్తేశారని వైసీపీ మరో ప్రచారం మొదలుపెట్టింది. సాక్షి ఛానల్‌లో నన్ను మిత్రులు కొమ్మినేని అదే ప్రశ్న వేశారు. ఎందుకంటే కేసులతో ప్రమేయం వున్నవారి పేర్లు వున్నాయి. కాని జగన్‌ పేరే వున్నట్టు టిడిపి చెబుతున్నది. అందులో నేరుగాపేర్లున్న బిజెపి నేతల సంగతి మాట్లాడ్డం లేదు. అందుకే ఉభయుల వాదనలూ రాజకీయ ప్రచారానికే పనికి వస్తాయని నేను సమాధానం చెప్పాను. ఇక జగన్‌ ఆస్తుల స్వాధీనం సాధ్యం కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నట్టు ఇప్పుడు వార్తలు వచ్చాయి. స్వాధీనం చేసుకుంటామని ఒకప్పుడు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన ప్రకటనలు నాకు గుర్తున్నాయి. అది జరిగే పని కాదని అప్పట్లోనే చెప్పాను. స్వాధీనాల సంగతి అటుంచి కొత్తగా ఒక్క వాదన గాని ఆధారం గాని ఈ మూడేళ్లలో సమకూర్చింది లేదు. కేవలం ఆరోపణలపై వాదోపవాదాలు తప్ప వీటిని ప్రజలు పెద్దగా పట్టించుకోరు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ టెన్షన్ : చంద్రబాబు ఎక్కడికెళ్లారు ?

చంద్రబాబు ఎక్కడికి వెళ్లారు..మాకిప్పుడే తెలియాల్సిందే అని వైసీపీ నేతలు గింజుకుటున్నారు. చంద్రబాబు, లోకేష్ కనిపించకపోయే సరికి వారేమీ చేస్తున్నారో .. ఆ చేసే పనులేవో తమను బుక్ చేసే పనులేమో అని...

వైసీపీ విమర్శలకు చెక్ పెట్టిన పవన్

పిఠాపురంలో జనసేనానిని ఓడించాలని వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసిందో లెక్కే లేదు. వ్యక్తిగత విషయాలను తెరమీదకు తీసుకొచ్చి పవన్ పాపులారిటీని తగ్గించాలని ప్రయత్నించింది.ఇందుకోసం పవన్ నాన్ లోకల్ అని, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో...

గుర్తొస్తున్నారు.. నాయుడు గారు

"ఆయన లేని లోటు పూడ్చలేనిది" సాధారణంగా ప్రఖ్యాత వ్యక్తులు వెళ్ళిపోయినప్పుడు జనరల్ గా చెప్పే వాఖ్యమిది. కానీ నిజంగా ఈ వాఖ్యానికి అందరూ తగిన వారేనా?! ఎవరి సంగతి ఏమోకానీ మూవీ మొఘల్...

చీఫ్ సెక్రటరీ బోగాపురంలో చక్కబెట్టి వెళ్లిన పనులేంటి ?

చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సీక్రెట్ గా చాలా పనులు చక్క బెడుతున్నారు. అందులో బయటకు తెలిసినవి.. తెలుస్తున్నవి కొన్నే. రెండు రోజుల కిందట ఆయన భోగాపురం విమానాశ్రయం నిర్మాణం జరుగుతున్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close