ప‌వ‌న్‌, ప్ర‌భాస్ ఫ్యాన్స్ మ‌ధ్య దుమారం

మ‌రోసారి ఫ్యాన్స్ మ‌ధ్య కుమ్ములాట‌లు మొద‌ల‌య్యాయి. బాహుబ‌లి 2 విడుద‌ల సంద‌ర్భంగా ప‌వ‌న్ – ప్ర‌భాస్ ఫ్యాన్స్ మ‌ధ్య లుక‌లుక‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి. గ‌త కొంత కాలం నుంచీ ఓ వ‌ర్గం మ‌రో వ‌ర్గాన్ని టార్గెట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా ప్ర‌భాస్‌, మెగా ఫ్యాన్స్ ప్రాబ‌ల్యం ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో ఎక్కువ‌గా ఉంది. భీమ‌వ‌రం, అమ‌లాపురం లాంటి ప్రాంతాల్లో ఒక‌రిపై మ‌రొక‌రు క‌య్యానికి కాలుదువ్వుకొంటున్నారు. బాహుబ‌లి 2 విడుద‌ల సంద‌ర్భంగా ప‌లుచోట్లు ప్ర‌భాస్ – ప‌వ‌న్ ఫ్యాన్స్ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌పూరిత‌మైన వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఇటీవ‌ల ప‌వ‌న్ క‌టౌట్‌ని తొల‌గించిన విష‌యంలో ప‌వ‌న్‌, ప్ర‌భాస్ ఫ్యాన్స్ మ‌ధ్య గొడ‌వ‌లు మొద‌ల‌య్యాయి. అవి ఇప్ప‌టికీ కొన‌సాగుతూనే ఉన్నాయి. ప‌వ‌న్ సినిమాల్ని ప్ర‌భాస్ ఫ్యాన్స్ బ‌హిష్క‌రించ‌డం, నెగిటీవ్ టాక్ ని తీసుకురావ‌డం ష‌రామామూలుగా మారింది. ఇప్పుడు ప‌వ‌న్ ఫ్యాన్స్ వంతు వ‌చ్చింది. బాహుబ‌లి 2 బాగోలేద‌ని ఓవ‌ర్గం భీమ‌వ‌రం, అమ‌లాపురం ఏరియాల్లో నెగిటీవ్ ప్ర‌చారం చేస్తోంది. ఇది క‌చ్చితంగా ప‌వ‌న్ ఫ్యాన్స్ ప‌నే అంటూ ప్ర‌భాస్ వ‌ర్గం మండిప‌డుతోంది. దీనికి సంబంధించి థియేట‌ర్ల ద‌గ్గ‌ర స్ప‌ల్పంగా ఘ‌ర్ష‌ణ‌లు ప‌డిన దాఖ‌లాలు ఒకొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నాయి. గురువారం అర్థ‌రాత్రి అమ‌లాపురంలో ప్ర‌భాస్, ప‌వ‌న్ ఫ్యాన్స్ మ‌ధ్య గొడ‌వ జ‌ర‌గ‌డంతో అక్క‌డ ఉద్రిక్తత‌ప‌ర‌మైన వాతార‌ణం నెల‌కొంది. మేమంతా ఒక్క‌టే అని హీరోలంతా మొత్తుకొంటున్నా.. ఈ ఫ్యాన్స్ మార‌డం లేదు. అభిమానం ఉండొచ్చు. కానీ అది పిచ్చిగా మార‌కూడ‌దు. మారితే…ఇలాంటి ప‌రిణామాలే ఎదుర‌వుతాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.