మోడీ సెల్ఫ్ గోల్…?

ఎన్నికల ప్రచారంలో తాజాగా ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. కాంగ్రెస్ ను ఇరకాటంలోకి నెట్టబోయి సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టుగా ప్రధాని వ్యాఖ్యలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది.

పొద్దున్న లేస్తే అంబానీ, అదాని అని మాట్లాడే కాంగ్రెస్ నేతలు ఎన్నికలు మొదలయ్యాక వారి గురించి ఎందుకు మాట్లాడటం మానేశారని ప్రశ్నించారు మోడీ. అదాని, అంబానీ నుంచి ఎంత మొత్తంలో నిధులు ఇచ్చారని కాంగ్రెస్ ను నిలదీశారు. మోడీ చేసిన ఈ వ్యాఖ్యలే రాజకీయ దుమారం రేపుతున్నాయి.

మోడీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తిప్పికొడుతున్నారు. మోడీ మిత్రులు అదాని, అంబానీల గురించి తలుపులు మూసి మాత్రమే మాట్లాడుతారని మొదటిసారి బహిరంగంగా ఆయన మాట్లాడుతున్నారని ప్రియాంక గాంధీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆయన వ్యాఖ్యలను చూస్తుంటే ఓటమి భయం స్పష్టం అవుతుందన్నారు. మరోవైపు ఏఐసీసీ అద్యక్షుడు ఖర్గే కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మోడీకి ఎంత గడ్డు కాలం వచ్చింది. ఆఖరికి తనకు అండగా నిలిచిన మిత్రులపైన కూడా మాటల దాడి చేసే స్థితికి చేరుకున్నారని ట్వీట్ చేశారు.

నిజంగానే.. అదాని, అంబానీలు కాంగ్రెస్ కు ఎన్నికల ఫండింగ్ చేశారా..? వారి వద్ద అంత పెద్దమొత్తంలో బ్లాక్ మనీ ఉంటే ఈడీ, సీబీఐలను ఎందుకు రంగంలోకి దిగడం లేదన్న ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి. బీజేపీ ప్రత్యర్ధుల విషయంలో దూకుడుగా వ్యవహరించే ఈడీ, సీబీఐలు ప్రధాని బహిరంగంగా అదాని, అంబానీల వద్ద నల్లదనం ఉందని చెప్పకనే చెప్తున్నా ఎందుకు మిన్నకుండిపోయాయని విమర్శలు వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భార్యా బాధితులను కామెడీగానే చూస్తున్న సమాజం !

తన భార్య నుండి తనకు , తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకుంటూ ప్రెస్ మీట్ పెట్టారు. హైదరాబాద్ లో ఘటన...

అప్పుడే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోన్న వైసీపీ..!!

ఏపీలో వైసీపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఎన్నికల ఫలితాన్ని ముందుగానే పసిగట్టారో మరేమిటో, అప్పుడే ప్రతిపక్ష పాత్రకు అలవాటుపడుతున్నట్లు కనిపిస్తోంది. అతిశయోక్తి అనిపించినా ఆ పార్టీ నేతలు చేస్తోన్న వరుస వ్యాఖ్యలు...
video

‘గం గం గణేశా’ ట్రైలర్ : నవ్వించే దొంగ

https://www.youtube.com/watch?v=wBZ7EUIM7fY బేబీతో ఓ యూత్ ఫుల్ విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ ఇప్పుడు 'గం గం గణేశా' సినిమా తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఇదొక క్రైమ్ కామెడీ. తాజాగా ట్రైలర్ ని వదిలారు....

జగన్ ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేసిన వైవీ సుబ్బారెడ్డి

వైవీ సుబ్బారెడ్డి జగన్ రెండో ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేశారు. విశాఖలో ప్రమాణం చేస్తానని జగనే ప్రకటించారు కాబట్టి ఎక్కడ అనే సందేహం లేదు. తొమ్మిదో తేదీన ప్రమాణం చేస్తారని బొత్స సత్యనారాయణ ఇంతకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close