పవన్‌ను రాజధాని గ్రామాలకు పోనివ్వని పోలీసులు..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రాజధాని గ్రామాల సందర్శనను పోలీసులు అడ్డుకున్నారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశాన్ని విజయవాడలో నిర్వహించిన ఆయన.. ఆ తర్వాత రాజధాని గ్రామాలకు వెళ్లాలనుకున్నారు. ఉదయం అంతా.. రైతులపై లాఠీచార్జ్ జరగడం.. పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేసిన వారిపై పోలీసులు విరుచుకుపడటంతో.. వారిని పరామర్శించడానికి వెళ్లాలనుకున్నారు. అయితే..ఈ విషయం తెలియడంతో.. పెద్ద ఎత్తున పోలీసులు మంగళగిరిలోని.. జనసేన కార్యాలయానికి వచ్చారు.

పవన్ కల్యాణ్ పర్యటనకు బయలుదేరితే అడ్డుకోవడానికి సిద్ధమయ్యారు. పలువురు పోలీసు అధికారులు పవన్ కల్యాణ్‌తో చర్చలు జరిపారు. రాజధాని గ్రామాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని.. పర్యటనకు వెళ్లవద్దని సూచించారు. పోలీసులు చర్చలు జరుపుతున్న సమయంలో.. ఆయన సోదరుడు నాగేంద్రబాబు.. జనసేన పార్టీ కార్యాలయం బయట మీడియాతో మాట్లాడారు. రైతులను పరామర్శించేందుకు పవన్ కల్యాణ్ సిద్ధమయ్యారని..పోలీసులు అడ్డుకుంటున్నారని విమర్శించారు.

రాజధాని రైతులకు సంఘిభావం తెలిపేందుకు వచ్చామని.. వారి పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామన్నారు. పోలీసు అధికారుల సూచలను పెద్దగా పట్టించుకోని పవన్ కల్యాణ్.. రాజధాని గ్రామాలకు వెళ్లేందుకు.. బయటకు వచ్చారు. కానీ పోలీసులు ఆయనను గేటు వద్దే నిలిపివేశారు. అప్పటికే.. పవన్ కల్యాణ్‌ను అడ్డుకుంటున్నారనే ప్రచారం జరగడంతో.. పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. దీంతో పోలీసులకు, పవన్ ఫ్యాన్స్ కు మధ్య తోపులాట చోటు చేసుకుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

విజయమ్మ బర్త్‌డే విషెష్ : షర్మిల చెప్పింది.. జగన్ చెప్పాల్సి వచ్చింది !

వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు...

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close