సహనం నశిస్తే “జేసీబీ”లకు బుగ్గవంక పరిస్థితే..!

కడపలో బుగ్గవంక నిర్వాసితుల ఇళ్లను జేసీబీలో దౌర్జన్యంగా కూలగొట్టడం ప్రారంభించిన వ్యవహారంలో ఇంజనీర్ రఘునాథరెడ్డిని నిర్వాసితులు తరిమికొట్టిన వీడియో ఇప్పుడు సంచలనాత్మకం అవుతోంది. ముఖ్యమంత్రి సొంత జిల్లాల్లో జేసీబీ రూల్‌ని అక్కడి ప్రజలు ఇలా తిరగబడతారని ఎవరూ ఊహించలేదు. ప్రభుత్వం పెద్ద ఎత్తున కేసులు పెడుతోంది. వ్యతిరేక స్వరం వినిపిస్తేనే అంగీకరించడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ ఇంజినీర్‌ని అదీ కూడా అధికార పార్టకి బాగా దగ్గర వ్యక్తిగా పేరున్న ఇంజినీర్ రఘునాథరెడ్డిని తరిమికొట్టడం అంటే చిన్న విషయం కాదు. వారిలో సహనం నశించిందని అర్థం చేసుకోవాలి.

బుగ్గవంక ప్రాజెక్టు విషయంలో చాలా రోజుల నుంచి నిర్వాసితులకు అన్యాయం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బుగ్గవంక అప్రోజ్ రోడ్డులో ఏళ్ల తరబడి పేదలు నివాసం ఉంటున్నారు. నిజానికి అది వారి స్థలమేమీ కాదు. కానీ రాజకీయ అండతో చాలా మంది పేదలు అక్కడ ఇళ్లు కట్టుకున్నారు. కరెంట్ .. ఇతర మౌలిక వసతుల్ని కూడా అధికారులు కల్పించారు. కడపలో ఎప్పుడూ ఒక పార్టీదే ఆధిపత్యం. వారే వారికి అండగా ఉంటూ వచ్చారు. అందుకే అప్పో సప్పో చేసి అక్కడ శాశ్వత నివాసాలు కట్టుకున్నారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు బుగ్గవంక ప్రాజక్ట్ ను సుందరీకరించాలని చెప్పి.. అక్కడ ఉన్న వారందర్నీ ఖాళీ చేయమని ఆదేశించారు.

వారు ఉంటున్నది ప్రభుత్వ స్థలమే కాబట్టి.. పరిహారం ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి… అందర్నీ ఉన్న పళంగా వెళ్లిపోవాలని నోటీసులు ఇచ్చి… హఠాత్తుగా జేసీబీతో కూల్చివేతలకు వచ్చారు. అక్కడ దాదాపుగా పదిహేను వందల కుటుంబాలు నివాసం ఉంటాయి. వీరంతా నగరంలో తోపుడు బండ్లు లాంటి చిరు వ్యాపారాలు చేస్తూ ఉంటారు. పక్కా గృహాలు ఇస్తామని ప్రభుత్వం హామీలు ఇచ్చింది కానీ అమలు చేయలేదు. ఇళ్లను కూలగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసి వారంతా కలెక్టరేట్ ముందు ఆందోళనలు కూడా చేస్తున్ారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇక ఆందోళనలతో సమస్య పరిష్కారంకాదని తిరగబడ్డారు.

ప్రభుత్వం ఇంజినీర్ రఘునాథరెడ్డిపై దాడి చేసిన వారిపై కేసులు పెట్టొచ్చు. కానీ.. అది ఆరంభం మాత్రమేనని.. ఓ సంకేతం ప్రజలకు వెళ్లింది. అధికారం ఉంది కదా అని జేసీబీలో దూసుకెళ్తే… తిరగబడకుండా ఎవరూ ఉండరని.. భయం అనేది.. ఓ స్థాయి వరకే ఉంటుందని.. ఈ ఘటనతో నిరూపితమయిందని అంటున్నారు. ప్రభుత్వ వర్గాలకు ఇదో హెచ్చరికగా భావించవచ్చని చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పాల్ గారి పార్టీ టిక్కెట్ కోసం రూ. 50 లక్షలు ఇచ్చాడట !

సమాజంలో కొన్ని వింతలు జరగుతూ ఉంటాయి. నమ్మాలా వద్దో తేల్చుకోలేము. కేఏ పాల్ ఎల్బీ నగర్ టిక్కెట్ ఇస్తానంటే రూ. 50 లక్షలు పాల్ కు ఇచ్చేశాడట. చివరికి పాల్ టిక్కెట్ ఇవ్వలేదని...

“ఈ ఆఫీస్” భద్రం – స్పందించిన ఈసీ

ఏపీ ప్రభుత్వం జీవోలను అన్నీ దాచిన ఈ ఆఫీస్ ను అప్ గ్రేడేషన్ పేరతో సమూలంగా మాల్చాలనుకున్న ఏపీ ప్రభుత్వానికి ఈసీ చెక్ పెట్టింది. ఈ ఆఫీస్ అప్ గ్రేడేషన్ పేరుతో...

విజయ్ సేతుపతి నుంచి ఓ వెరైటీ సినిమా

హీరోగానే కాకుండా ప్రతి నాయకుడిగానూ కనిపించి ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి. హీరోయిజం లెక్కలు వేసుకోకుండా పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన ప్రయాణం సాగుతోంది. ఇదే ఆయన్ని...

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close