మెగా అభిమానులకు పండగే పండగ!

హైదరాబాద్: మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇవాళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఒకేసారి మెగాహీరోలు నలుగురివి ప్రోమోలు రిలీజ్ అయ్యాయి. నిన్న వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తున్న ‘కంచె’ చిత్రం ట్రైలర్ విడుదలై అద్భుతమైన విజువల్స్‌తో అందరినీ ఆకట్టుకుంది. అర్థరాత్రి పవన్ తాజా చిత్రం ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ టీజర్‌ను, పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. దీనిపై రాంచరణ్ స్పందిస్తూ ఇంతవరకూ బాబాయ్ పోస్టర్‌లలో ఇదే బెస్ట్ అని ట్వీట్ చేశారు. మరోవైపు రాంచరణ్ తాజా చిత్రం ‘బ్రూస్‌లీ’ టీజర్ ఇవాళ ఉదయం విడుదలయింది. దీనిలో ఫ్యామిలీ సీన్‌లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చరణ్ ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాలోలాగా కనిపిస్తున్నాడు. ఇటు సాయి ధరమ్‌తేజ్ చిత్రం ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ చిత్రం ట్రైలర్‌ కూడా ఇవాళ విడుదలయింది.

ఇక పవన్‌కు సన్నిహితుడైన రచయిత కోన వెంకట్ పవనిజంపై ఓ పాట రాసి తను రచన చేస్తూ నిర్మిస్తున్న ‘శంకరాభరణం’ టీమ్ తరపున విడుదల చేశారు. శంకరాభరణం పోస్టర్‌ సైతం విడుదలయింది. దీనిలో నిఖిల్, నందిత హీరో, హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. మొన్న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా అక్కినేని ఫ్యామిలీలోని ముగ్గురు హీరోల చిత్రాల ప్రోమోలు విడుదలై రికార్డ్ సృష్టించగా, ఇవాళ నలుగురు మెగా హీరోల చిత్రాల ప్రోమోలు విడుదలవటం విశేషం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close