రామ్ అసంతృప్తి..??

దిల్‌రాజు సినిమా అన‌గానే క‌థేంటో కూడా తెలుసుకోకుండా హీరోలంతా `ఓ ఎస్‌…` అనేస్తారు. ఎందుకంటే దిల్‌రాజు ప్రొడ్యూస‌ర్ల‌లో ఓ స్టార్‌. ఆయ‌నో మేక‌ర్‌. ఏ సినిమాకి ఎంత పెట్టాలో, ఎలాంటి బ‌జ్ సృష్టించాలో ఆయ‌న‌కు తెలుసు. అందుకే.. దిల్‌రాజు సినిమాల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ద చూపిస్తుంటారు హీరోలు. యువ హీరోల‌కు ఆ సంస్థ‌లో న‌టించే ఛాన్స్ వ‌స్తే… పారితోషికం గురించి కూడా ప‌ట్టించుకోకుండా ప‌ని చేస్తారు. రామ్ కూడా అదే చేశాడు. త‌న కెరీర్‌లో తొలిసారి దిల్‌రాజు సంస్థ‌లో ప‌నిచేశాడు. `హ‌లో గురు ప్రేమ కోస‌మే` ఇప్పుడు విడుద‌ల‌కు కూడా సిద్ధ‌మైంది. అయితే.. ఈ సినిమా విష‌యంపై, దిల్‌రాజు ప‌బ్లిసిటీ స్ట్రాట‌జీ విష‌యంలోనూ రామ్ అసంతృప్తిగా ఉన్నాడ‌ని టాక్‌.

పండ‌గ రోజున `హ‌లో గురూ..` విడుద‌ల అవుతోంది. ఓ విధంగా ఈసినిమాకి అదే ప్ల‌స్‌. కాక‌పోతే.. బ‌రిలో `అర‌వింద స‌మేత‌` ఇంకా వీర విహారం చేస్తూనే ఉంది. ఓ ర‌కంగా… రామ్ ఈ ప‌రిస్థితిలో బాక్సాఫీసుని మెప్పించ‌డం అంత సుల‌భం కాదు. పైగా రామ్ గ‌త చిత్రం `ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ` బాక్సాఫీసుని పెద్ద‌గా మెప్పించ‌లేక‌పోయింది. దిల్‌రాజు `క‌ల్యాణ వైభోగం` కూడా డిజాస్ట‌ర్ లిస్టులో చేరిపోయింది. ఈ ద‌శ‌లో.. ప్ర‌మోష‌న్లు భారీగా చేయాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. ఎప్పుడూ స్ర‌వంతి మూవీస్ రామ్‌కి అండ‌గా నిలిచేది. ప్ర‌మోష‌న్ విష‌యంలో త‌న ప్లానింగ్ త‌న‌కు ఉండేది. దాదాపుగా త‌న సూచ‌న‌ల మేర‌కే త‌న సినిమాల ప‌నుల‌న్నీ జ‌రిగేవి. అయితే ఇప్పుడు ఈ వ్య‌వ‌హారం అంతా దిల్ రాజు చేతిలోకి వెళ్లిపోయింది. దాంతో రామ్‌.. ఆలోచ‌న‌లు, ప్లానింగులు ఏమీ వ‌ర్కవుట్ కావ‌డం లేదు. అన్నిటికి మించి.. విడుద‌ల‌కు ముందే రావ‌ల్సిన బ‌జ్ ఈ సినిమాకి రాలేదు. ఈ విష‌యంలోనూ రామ్ అసంతృప్తితో ఉన్న‌ట్టు టాక్‌. రేపు ఈ సినిమా విడుద‌లై.. హిట్ట‌యితే – ఈ లోటేం పెద్ద‌గా క‌నిపించ‌క‌పోవొచ్చు. టాక్ బాగున్నా వ‌సూళ్లు అంతంత మాత్రంగా ఉంటే – క‌చ్చితంగా ప‌బ్లిసిటీ ఓ లోప‌మైపోతుంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స‌ర్‌ప్రైజ్ ఇదేనా డార్లింగ్‌?!

సోష‌ల్ మీడియాకు పెద్ద‌గా ట‌చ్‌లో ఉండ‌ని హీరో ప్ర‌భాస్‌. ఎప్పుడో గానీ, ప్ర‌భాస్ ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టా ఖాతాలు యాక్టీవ్‌లోకి రావు. కానీ ఇప్పుడు ప్ర‌భాస్ చేసిన ఓ పోస్ట్... అభిమానుల్లో ఆస‌క్తి రేపుతోంది....

కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక… వైసీపీ ఓటమికి సంకేతమా…?

ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా రాష్ట్రంలో దాడులు జరిగే అవకాశం ఉందన్న కేంద్ర నిఘా వర్గాల తాజా హెచ్చరికలు దేనికి సంకేతం..?ఇంటలిజెన్స్ వర్గాల హెచ్చరికలు వైసీపీ ఓటమి ఖాయమని...

బటన్ నొక్కి లబ్దిదారుల నోట్లో మట్టి – డబ్బుల్లేవా ?

పోలింగ్ కు రెండు రోజుల ముందు లబ్దిదారుల ఖాతాల్లో రూ. 14వేల కోట్లు వేసేస్తామని హడావుడి చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఆ డబ్బులు జమ చేయడం లేదు. ఇదిగో అదిగో అంటూ ...

హైకోర్టును ఆశ్రయించిన ఎన్టీఆర్…ఎందుకంటే..?

జూనియర్ ఎన్టీఆర్ తన ల్యాండ్ కు సంబంధించి వివాదం తలెత్తడంతో హైకోర్టును ఆశ్రయించారు. జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 75లో ఉన్న ప్లాట్ విషయంలో ఈ వివాదం తలెత్తింది. 2003లో గీత లక్ష్మీ అనే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close