శర్వా Vs 14 రీల్స్‌… నిర్మాత వెర్ష‌న్ ఇదీ!

ఎప్పుడూ… ఎలాంటి వివాదాల జోలికీ వెళ్ల‌ని హీరో శ‌ర్వానంద్‌. త‌న ప‌ని తాను కామ్ గా చేసుకుంటూ వెళ్లిపోతాడు. అయితే.. ఇప్పుడు 14 రీల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ తో కాస్త గ్యాప్ వ‌చ్చింది. దానికి కార‌ణం.. `శ్రీ‌కారం` ఇష్యూ. ఈ సినిమాకి సంబంధించి శ‌ర్వాకి నిర్మాత‌లు మ‌రో 2 కోట్ల పారితోషికం ఇవ్వాలి. అక్క‌డే అస‌లు స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది. సినిమా విడుద‌లై ఇన్ని రోజులైనా నిర్మాత‌లు ఆ సొమ్ము శ‌ర్వాకి ఇవ్వ‌లేదు. స‌రిక‌దా.. నిర్మాణ సంస్థ ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయి. దాంతో శ‌ర్వా లీగ‌ల్ గా ప్రొసీడ్ అవ్వాల్సివ‌చ్చింది. ఈ స‌మ‌స్య‌ని 14 రీల్స్ సంస్థ కూడా సున్నితంగానే ప‌రిష్కరించుకొందామ‌నుకుంది. అయితే శ‌ర్వాకి 2 కోట్ల పారితోషికం ఇవ్వ‌కపోవ‌డానికి కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన పాయింట్లు.. రేజ్ చేస్తోంది నిర్మాణ సంస్థ‌. ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్ ప్ర‌కారం… శ‌ర్వా వివాదం వెనుక కొన్ని కీల‌క‌మైన పాయింట్లు ఉన్నాయి. అవేంటంటే…

* శ‌ర్వాకి 14 రీల్స్‌… 2 కోట్లు ఇవ్వాల‌న్న‌ది నిజం. అందుకు ఇచ్చిన చెక్ లు కూడా బౌన్స్ అయిన మాట నిజం. ఈ విష‌యంలో 14 రీల్స్ ఎలాంటి దాగుడు మూత‌లూ ఆడ‌డం లేదు. కాక‌పోతే ఆ డ‌బ్బులు తిరిగి ఇవ్వ‌డానికి కాస్త స‌మ‌యం అడుగుతున్నారు.

* `శ్రీ‌కారం` షూటింగ్ ఏమాత్రం స‌వ్యంగా జ‌ర‌గలేదు. మ‌ధ్య‌లో `జాను` షూటింగ్ సంద‌ర్భంగా శ‌ర్వాకి గాయ‌మైంది. ఆ ఎఫెక్ట్ శ్రీ‌కారం సినిమాపై ప‌డింది. శ్రీ‌కారం కూడా ఆల‌స్య‌మైంది. గ‌త యేడాది ఏప్రిల్ లో విడుద‌ల కావాల్సిన సినిమా.. 12 నెల‌లు ఆల‌స్యంగా వ‌చ్చింది.ఈ భార‌మంతా నిర్మాత‌లే మోయాల్సివ‌చ్చింది. శ్రీ‌కారం క్లైమాక్స్ షూటింగ్ అన‌గా… శ‌ర్వా అమెరికా వెళ్లిపోయాడు. త‌ను తిరిగి వ‌చ్చేంత వ‌ర‌కూ.. చిత్ర‌బృందం ఎదురు చూసింది.

* శ్రీ‌కారం విడుద‌లైన టైమ్ ఏమాత్రం బాగాలేదు. ఎందుకంటే సినిమా విడుద‌లైన కొద్ది రోజుల‌కే… లాక్ డౌన్‌, థియేట‌ర్ల మూత‌.. జ‌రిగిపోయాయి. ఈ సినిమా కొన్న బ‌య్య‌ర్లు నిర్మాత‌ల‌కు ఇవ్వాల్సిన డ‌బ్బులు ఇంకా తిరిగి చెల్లించ‌లేదు. అంద‌రి నోటా ఒక‌టే మాట‌.. `క‌రోనా..`. ఇలాంటి ప‌రిస్థితుల్లో నిర్మాత‌ల‌కు రావాల్సిన డ‌బ్బులు చాలా ఆగిపోయాయి. అవొస్తే శ‌ర్వాకి క్లియ‌ర్ చేసేద్దామ‌న్న ఉద్దేశంలో నిర్మాత‌లు ఉన్నారు.

* ఈమ‌ధ్య నిర్మాత‌ల మండ‌లి ఓ ప్ర‌త్యేక తీర్మాణం చేసింది. అదేంటంటే…. క‌రోనా ప‌రిస్థితుల నేప‌థ్యంలో, నిర్మాత‌లు మ‌ళ్లీ తేరుకోవ‌డానికి క‌నీసం 20 శాతం పారితోషికం త‌గ్గించుకోవాల‌ని సూచించింది. ఆ లెక్క‌న‌.. శ‌ర్వా కూడా పారితోషికం త‌గ్గించుకుని, త‌మ‌కు 2 కోట్ల‌కు వెసులు బాటు ఇస్తాడ‌ని నిర్మాతలు ఎదురు చూశారు. కానీ శ‌ర్వా నుంచి… పాజిటీవ్ రెస్పాన్స్ రాలేదు.

* మ‌రో కీల‌క‌మైన విష‌యం… శ‌ర్వా నిర్మాత‌గా `కో అంటే కోటి` అనే సినిమా వ‌చ్చింది. ఆ సినిమాకి సంబంధించిన ఓ ఏరియా రైట్స్ అప్ప‌ట్లో 14 రీల్స్ తీసుకుంది. దానికి సంబంధించి శ‌ర్వా.. 14 రీల్స్ కి కొంత మొత్తం ఇవ్వాలి. ఆ విష‌యం ఇప్ప‌టి వ‌ర‌కూ తేల‌లేద‌ని తెలుస్తోంది. అందుకే శ‌ర్వాకి ఇవ్వాల్సిన 2 కోట్లు హోల్ట్ లో పెట్టిన‌ట్టు స‌మాచారం. 14 రీల్స్ ఇప్ప‌టికీ…. ఈ వివాదాన్ని సామ‌ర‌స్య‌పూర్వ‌కంగానే ప‌రిష్క‌రించుకోవాల‌ని చూస్తోంది. శ‌ర్వాతో.. మాట్లాడి, ఈ స‌మ‌స్య‌కు పుల్ స్టాప్ పెట్టాల‌నుకుంటోంది. అందుకు సంబంధించిన‌.. సంప్ర‌దింపులు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే ఓ కొలిక్కి రావొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close