సోమవారం నుంచి మళ్ళీ పార్లమెంటు సమావేశాలు మొదలు

సోమవారం నుంచి మళ్ళీ పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మొదలవబోతున్నాయి కనుక లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్ని రాజకీయ పార్టీలను రేపు సమావేశం ఏర్పాటు చేసి సభా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు సహకరించవలసిందిగా కోరబోతున్నారు. ఈ తంతు ప్రతీసారి జరిగేదే కానీ దేనిదారి దానిదేనన్నట్లు పార్లమెంటు సమావేశాలు మొదలవగానే ఏదో ఒక అంశం లేవనెత్తి సభా కార్యక్రమాలు జరుగకుండా ప్రతిపక్షాలు అడ్డుపడుతుంటాయి. ఆవిధంగా చేసి కేంద్రప్రభుత్వాన్ని ఇరుకున పెట్టామని అవి చాలా సంతోషించవచ్చు కానీ ఆవిధంగా చేసి సభలో సమస్యలపై లోతుగా చర్చ జరగకుండా చేసి, వాటికి కేంద్రప్రభుత్వం సమాధానాలు చెప్పుకోకుండా తప్పించుకొనే అవకాశం కల్పిస్తున్నాయి.

అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలోని కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చివేసినందుకు ఆ పార్టీ కేంద్రప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. కనుక సోమవారం నుంచి మొదలయ్యే సమావేశాలలో అదే అంశం పుచ్చుకొని కాంగ్రెస్ పార్టీ కేంద్రంతో పోరాడటం తధ్యం. దానిని ఎదుర్కొనేందుకు కేంద్రప్రభుత్వం ఇష్రాత్ జహాన్ కేసును చేతిలో సిద్దంగా ఉంచుకొంది.ఆ కేసులో చిదంబరం వంటి మాజీ కేంద్ర మంత్రులపై కొన్ని ఆరోపణలున్నాయి.

అయితే కాంగ్రెస్ పార్టీని ఎలాగయినా ఒప్పించి ఈ సమావేశాలలో జి.ఎస్.టి. బిల్లును ఆమోదింపజేసుకొంటామని వెంకయ్య నాయుడు తదితరులు చెపుతున్నారు. అవి కాక మరో 15-20 బిల్లులపై సభలో చర్చ జరిపి ఆమోదం తెలుపవలసి ఉంది. కానీ కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు దానికి సహకరిస్తాయనే నమ్మకం లేదు. రాజ్యసభలో భాజపాకి తగినంత బలం లేకపోవడం వలననే అది బిల్లులను ఆమోదింపజేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ దయాదాక్షిణ్యాలపై ఆధారపడవలసి వస్తోంది. కానీ మున్ముందు భాజపా దాని మిత్రపక్షాలకి రాజ్యసభలో బలం పెరిగితే ఇంక కాంగ్రెస్ ని లెక్క చేయనవసరం కేంద్రప్రభుత్వానికి ఉండదు. కనుక ముఖ్యమయిన బిల్లులు ఆమోదానికి కాంగ్రెస్ పార్టీ కేంద్రానికి సహకరిస్తే, అది తమ గొప్పతనంగా చాటింపువేసుకొనే అవకాశమయినా మిగులుతుంది కదా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close