‘భైర‌వ‌కోన‌’.. భ‌లే బేరం

ఈరోజుల్లో చిన్న సినిమా విడుద‌ల‌కు ముందే సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోయిందంటే.. అదే పెద్ద విజ‌యం. ఓటీటీ, డిజిట‌ల్ రైట్స్ ఆగిపోయిన వేళ.. అది మ‌రింత గొప్ప విష‌యం. ఇదంతా ఎందుకంటే.. సందీప్ కిష‌న్ సినిమా ‘ఊరి పేరు భైర‌వ కోన‌’ విడుద‌ల‌కు ముందే సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోయింది. ఈ సినిమాపై ఏకంగా రూ.27 కోట్లు ఖ‌ర్చు పెట్టారు నిర్మాత రాజేష్ దండా. ఆయ‌న గ‌త చిత్రం ‘సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌’ బాక్సాఫీసు ద‌గ్గ‌ర మంచి విజ‌యాన్ని అందుకొంది. లాభాల్నీ తెచ్చిపెట్టింది. అదే న‌మ్మ‌కంతో సందీప్ పై రూ.27 కోట్లు పెట్టారు.

సందీప్ కి ఈమ‌ధ్య హిట్లు లేవు. త‌న మార్కెట్ అంతంత మాత్రంగానే ఉంది. అయినా స‌రే.. ఈ సినిమా నాన్ థియేట్రిక‌ల్‌, థియేట్రిక‌ల్ రైట్స్ మంచి రేటుకి అమ్ముడ‌య్యాయి. ఆదిత్య మ్యూజిక్ నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ ని రూ.15 కోట్ల‌కు కొనుగోలు చేసింది. థియేట్రిక‌ల్ హ‌క్కుల్ని రూ.14 కోట్ల‌కు వీ 3 ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చేజిక్కించుకొంది. అలా.. విడుద‌ల‌కు ముందే ఈ సినిమా సేఫ్ అయిపోయింది. ద‌ర్శ‌కుడు వీఐ ఆనంద్ పై ఉన్న న‌మ్మ‌కం, ఈ సినిమాలోని రెండు పాట‌లు ఇప్ప‌టికే సూప‌ర్ హిట్ అవ్వ‌డం, టీజ‌ర్ కూడా ప్రామిసింగ్ గా క‌నిపించ‌డంతో.. ఈ సినిమాపై దృష్టి పెట్టారు. ఫిబ్ర‌వ‌రి 9న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఆ రోజున ‘ఈగ‌ల్‌’, ‘లాల్ స‌లామ్‌’ విడుద‌ల‌కు రెడీగా ఉన్నాయి. మ‌రి ఈ రెండు సినిమాల‌కూ ‘భైర‌వ‌కోన‌’ ఏమేర‌కు పోటీ ఇస్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చాయ్‌కీ.. చైతూకీ భ‌లే లింకు పెట్టేశారుగా!

స‌మంత‌తో విడిపోయాక‌.. నాగ‌చైత‌న్య మ‌రో పెళ్లి చేసుకోలేదు. కాక‌పోతే... త‌న‌కో 'తోడు' ఉంద‌న్న‌ది ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల మాట‌. క‌థానాయిక‌ శోభిత ధూళిపాళ తో చై స‌న్నిహితంగా ఉంటున్నాడ‌ని, వీరిద్ద‌రూ డేటింగ్ చేస్తున్నార‌ని చాలార‌కాలుగా...

ఎక్స్ క్లూజీవ్‌: దిల్ రాజు బ్యాన‌ర్‌లో ధ‌నుష్‌

ధ‌నుష్ ఈమ‌ధ్య తెలుగు ద‌ర్శ‌కులు, తెలుగు నిర్మాత‌ల‌పై దృష్టి పెట్టాడు. 'సార్' అలా వ‌చ్చిందే. ఈ సినిమా బాక్సాఫీసు ద‌గ్గ‌ర మంచి ఫ‌లితాన్ని అందుకొంది. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో 'కుబేర‌' చేస్తున్నాడు....

ఇస్మార్ట్… ప‌ట్టాలెక్కింది!

రామ్ - పూరి జ‌గ‌న్నాథ్ కాంబోలో వ‌చ్చిన 'ఇస్మార్ట్ శంక‌ర్‌' ఇన్‌స్టెంట్ హిట్ అయిపోయింది. రామ్ కెరీర్‌లోనే భారీ వ‌సూళ్ల‌ని అందుకొన్న సినిమా ఇది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'డ‌బుల్ ఇస్మార్ట్'...

అక్ష‌య్ ప‌ని పూర్త‌య్యింది.. మ‌రి ప్ర‌భాస్ తో ఎప్పుడు?

మంచు విష్ణు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న చిత్రం 'క‌న్న‌ప్ప‌'. ఈ సినిమాలో చాలామంది పేరున్న స్టార్స్ క‌నిపించ‌బోతున్నారు. అందులో ప్ర‌భాస్ ఒక‌డు. ఈ చిత్రంలో ఆయ‌న నందీశ్వ‌రుడిగా అవ‌తారం ఎత్త‌బోతున్నారు. అక్ష‌య్ కుమార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close