జగన్‌ పిటిషన్ వెనక్కి తీసుకోవడానికి ఒప్పుకోని సునీత..!

వైఎస్ వివేకా హత్య కేసు విచారణను సీబీఐకి ఇవ్వాలంటూ గతంలో.. జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకునేందుకు.. చేసిన ప్రయత్నాలను… వైఎస్ వివేకా కుమార్తె సునీత వ్యతిరేకిస్తున్నారు. తన పిటిషన్ వెనక్కి తీసుకుంటానంటూ.. జగన్ వేసిన పిటిషన్‌పై.. సునీత తరపు లాయర్..కోర్టులో వ్యతిరేకించారు. దాంతో.. న్యాయమూర్తి.. ఎందుకు వెనక్కి తీసుకోవాలనుకుంటున్నారో చెప్పాలంటూ… ప్రభుత్వం తరపు న్యాయవాదుల్ని ఆదేశించింది.

వైఎస్ వివేకా హత్య జరిగిన సమయంలో.. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. కారణాలు ఏమైనా కానీ.. జగన్.. కేసు విచారణను సీబీఐకి ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. హైకోర్టులో స్వయంగా పిటిషన్ వేశారు. నిజానికి ఇలాంటి పిటిషన్లు..ఆయన భార్య, పిల్లలు మాత్రమే వేయడానికి అవకాశం ఉంది. అయితే.. సమీప బంధువుగా చెబుతూ జగన్ కూడా… విడిగా పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై వాదనల్లో అప్పట్లో.. విచారణ వివరాలు బయటకు చెప్పవద్దని హైకోర్టు పోలీసుల్ని ఆదేశించింది. ఆ తర్వాత జగన్ అధికారంలోకి రావడంత.. కేసు విచారణ నెమ్మదించడం.. వరుసగా… విచారణాధికారుల్ని మార్చడంతో… కేసు దాదాపుగా కోల్డ్ స్టోరేజీలోకి వెళ్లిందన్న అభిప్రాయం ఏర్పడింది.

ఈ క్రమంలో.. వైఎస్ వివేకా కుమార్తె సునీత హైకోర్టులో సీబీఐ విచారణకు పిటిషన్ వేయడం.. సంచలనం సృష్టించింది. స్వయంగా సీబీఐ విచారణ కోరుతూ.. ముఖ్యమంత్రి జగన్ పిటిషన్ కూడా… పెండింగ్‌లో ఉన్న విషయాన్ని.. సునీత తన అఫిడవిట్‌లో గుర్తు చేశారు. దీంతో ఉలిక్కిపడటం… జగన్ లాయర్ల వంతు అయింది. సీఎం హోదాలో ఉన్న వ్యక్తే.. సీబీఐ విచారణ కోరుతూండగా.. ప్రభుత్వ లాయర్లు మాత్రం భిన్నమైన వాదన వినిపించాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్న వస్తుందన్న ఆలోచన రావడంతోనే.. పిటిషన్ ఉపసంహరణకు ప్రయత్నాలు చేశారు. కానీ సునీత లాయర్లు అడ్డు చెప్పారు. ఇప్పుడు.. పిటిషన్ ఉపసంహరణకు.. కారణాలను..జగన్ చెప్పాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close