సుప్రీంకోర్టు న్యాయమూర్తికి బెదిరింపు లేఖ!

రాజకీయ నాయకులకు, న్యాయమూర్తులకు బెదిరింపు లేఖలు అందుకోవడం సర్వసాధారణ విషయమే అయినా, చివరి సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కూడా బెదిరింపు లేఖలు రావడం చాలా ఆందోళన కలిగించే విషయమే. ముంబై ప్రేలుళ్ళ కేసులో యాకుబ్ మీమన్ని తెల్లవారితే ఉరి తీస్తారనగా, ఆరోజు తెల్లవారుజామున అతని తరపున న్యాయవాదులు జస్టిస్ దీపక్ మిశ్ర నేతృత్వంలోని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించారు. అతనికి చట్ట ప్రకారం రెండు వారాల ముందుగా డెత్ వారెంట్ ఇవ్వలేదు కనుక అతని ఉరిశిక్షని నిలిపివేయమని కోరారు. కానీ న్యాయమూర్తి దీపక్ మిశ్ర వారి అభ్యర్ధనని తిరస్కరించడంతో నాగపూర్ సెంట్రల్ జైల్లో యాకుబ్ మీమన్ని ఉరితీయబడ్డాడు. కనుక గుర్తు తెలియని వ్యక్తులెవరో దీపక్ మిశ్రా ఇంటి గేటు ముందు ఒక బెదిరింపు లేఖని వదిలివెళ్ళారు. ఆయన భద్రతా సిబ్బంది డిల్లీలో తుగ్లక్ రోడ్డులో గల పోలీస్ స్టేషన్లో దీని గురించి పిర్యాదు చేసారు. ఆ లేఖను పోలీసులకి అందజేశారు. దీనిపై తక్షణమే స్పందించిన డిల్లీ జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ ముకేష్ కుమార్ మీనా దీనిపై దర్యాప్తు కోసం ఉగ్రవాద నిరోధ బృందాన్ని రంగంలో దింపారు. డిల్లీలోకి 9మంది పాక్ ఉగ్రవాదులు జోరబడ్డారని నిఘావర్గాలు హెచ్చరికలు జారీ చేసిన నేపధ్యంలో ఈ లేఖ వారే పంపారా? లేకపోతే స్థానికంగా వారికి మద్దతు ఇస్తున్న వారెవరయినా పంపారా? అనే విషయం కనిపెట్టేందుకు దర్యాప్తు మొదలు పెట్టారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close