రూ. వెయ్యి క్రెడిట్ బీజేపీకి కట్టబెడుతున్న టీడీపీ..!

ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీకి లేనిపోని క్రెడిట్ కట్టబెట్టేందుకు తెలుగుదేశం పార్టీ విశ్వ ప్రయత్నం చేస్తోంది. తమ పార్టీ కోసం.. ఇంత కాలం కష్టపడ్డారేమో కానీ.. ఆ పార్టీ నేతలు ఇప్పుడు.. బీజేపీ కోసం శ్రమిస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే.. కరోనా సాయం కింద… బియ్యం కార్డులు ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం రూ. వెయ్యి పంపిణీ చేస్తోంది. దీన్ని జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారని చెబుతూ… వాలంటీర్లు కూడా కాకుండా.. వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారే పంపిణీచేస్తున్నారు. దీనిపై టీడీపీ నేతలు మండి పడుతున్నారు. ఇదంతా కేంద్ర సాయం అని..జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారని ఎలా చెబుతారని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో అదే పనిగా… ఇది మోడీ ఇస్తున్న సొమ్ము అనిచెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. నేరుగా విమర్శలు చేస్తున్నారు . కేంద్ర సాయాన్ని తన సాయంగా ఎలా చెప్పుకుంటారని అంటున్నారు.

అయితే.. ఇదంతా టీడీపీ నేతల ఘోషే కానీ బీజేపీ నేతలు మాత్రం నోరు మెదపడం లేదు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ.. ఓ ట్వీట్ చేసి.. సైలెంటయిపోయారు.కేంద్ర సాయాన్ని జగన్ పేరుతో పంచడాన్ని ఆయన ఖండించారు. అయితే.. బీజేపీ తరపున టీడీపీ నేతలే వకాల్తా పుచ్చుకున్నారు. అదే పనిగా మోడీకి దక్కాల్సిన క్రెడినట్ జగన్ తీసుకుంటున్నారని.. వాదించడం ప్రారంభించారు. కరోనా సాయం నిజానికి కేంద్రం ఏమీ ఇవ్వడం లేదు. విపత్తు నిధులు మాత్రం దండిగా ఇచ్చింది.

వాటి నుంచే.. ఏపీ ప్రభుత్వం.. సాయం పంపిణి చేస్తోంది. కేంద్రం జన్ ధన్ ఖాతాలు ఉన్న వారికి విడిగా నెలకు రూ. ఐదు వందలు అకౌంట్లలో వేస్తోంది. కానీ ప్రజలకు రూ. వెయ్యి పంచాలని ఎక్కడా చెప్పలేదు. విపత్తు నిధులను వాడుకునే అవకాశం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వాలే.. ఈ నిధులు ఇలా ఉపయోగించుకుంటున్నాయి. బీజేపీకి క్రెడిట్ దక్కినా పర్వాలేదు కానీ… వైసీపీకి మాత్రం దక్కకూడదని.. టీడీపీ నేతలు.. బీజేపీకిమద్దతుగా ప్రచారం చేయడం ప్రారంభించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close