అసెంబ్లీ భేటీ : ప్రతిపక్షానికి గౌరవం దక్కుతుందా..?

అధికార, ప్రతిపక్ష వ్యూహ, ప్రతివ్యూహాలతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వేడి పుట్టించడం ఖాయంగా కనిపిస్తోంది. 14 రోజులపాటు సమావేశాలు జరపాలని నిర్ణయించారు. అయితే ప్రతిపక్షం కోరితే సమావేశాలు పొడిగిస్తామని ప్రభుత్వం ప్రకటించుకుంది. రాష్ట్రంలో కరువు పరిస్థితులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, విత్తనాల కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు, టీడీపీ ఎమ్మెల్యేలకు జరుగుతున్న అవమానంపై శాసనసభ సమావేశాల్లో ప్రస్తావించాలని టీడీపీ నిర్ణయించుకుంది. మొత్తం 23 అంశాలపై చర్చించాలని బీఏసీ సమావేశంలో వైసీపీ శాసనసభాపక్షం కోరింది.

తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు వివిధ అంశాలపై ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించాలని నిర్ణయించడంతో ఈ సమావేశాలు వాడీవేడిగా జరగనున్నాయి. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలతో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని తెలుగుదేశం ఆరోపిస్తోంది. దీనిపై ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీయాలని ఆ పార్టీ నిర్ణయించింది. విత్తనాల కొరత, కరువు పరిస్థితులపై కూడా తెలుగుదేశం అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ఎవరెవరు ఏ అంశాలపై మాట్లాడాలో, శాసనమండలిలో వ్యవహారించాల్సిన తీరుపై కూడా పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అటు శాసనసభ్యులకు, ఇటు ఎమ్మెల్సీలకు ఇప్పటికే దిశానిర్ధేశం చేశారు. శాసనసభలో తెలుగుదేశం పార్టీని, ప్రతిపక్ష నేత చంద్రబాబును కార్నర్ చేయడానికి వైసీపీ ఏ అవకాశమూ వదిలి పెట్టదు.

పన్నెండో తేదీన బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత అంశాల వారీగా శ్వేతపత్రాలను అసెంబ్లీ సాక్షిగా విడుదల చేయనుంది ప్రభుత్వం. ఆర్థిక రంగంపై బుగ్గన శ్వేతపత్రం.. చూస్తే.. కచ్చితంగా.. టీడీపీ పాలనా వైఫల్యాలను ఎండగట్టే విధంగా ఉంటాయన్న విషయం మాత్రం క్లారిటీ ఉంటుంది. వీటిని ఎదుర్కోవడానికి వీలైతే.. అసెంబ్లీలో… లేకపోతే.. బయట… నిజమైన అంకెలను బయట పెట్టాలని టీడీపీ నేతలు… ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. మొత్తానికి.. ఏపీ అసెంబ్లీలో.. పోరాటానికి మాత్రం కొదువ ఉండదు. రాజకీయం వెల్లువలా సాగడం ఖాయంగానే కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close