కేసీఆర్‌ను కొట్టలేమని తెలంగాణ బీజేపీకి క్లారిటీ !

సంక్షేమ పథకాల్లో కేసీఆర్ ను కొట్టలేము… ఆయన తోపు..తురుము అనే మాటలు తెలంగాణ వ్యాప్తంగా రోజూ వినిపిస్తాయి. మంత్రులు, బీఆర్ఎస్ నేతలు అదే చెబుతూంటారు. ఇదంతా మామూలే. కానీ… ఇప్పుడు బీజేపీ నేతలు కూడా అదే అందుకుంటున్నారు. సంక్షేమ పథకాలల్లో సీఎం కేసీఆర్‌ను కొట్టలేమన్నారు. కేసీఆర్‌ను కొట్టాలంటే ఆయనిచ్చిన హామీలు అమలులో లోపాలతోనే కొట్టాలని.. లేకుంటే కేసీఆర్ కు ఓడించటం కష్టమంటూ చెప్పుకొచ్చారు. సంక్షేమ పథకాల విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్.. మధ్యప్రదేశ్ సీఎం‌ శివరాజ్ ఒక్కటే అని కూడా సర్టిఫికెట్ ఇచ్చారు.

బండి సంజయ్ మార్పు కారణంగా బీజేపీ డ్యామేజీ అయిందనడం కరెక్ట్ కాదన్నారు. అధ్యక్షుడిని ఎందుకు మార్చారో మార్చిన వాళ్లకు బాగా తెలుసని.. నేతలను కలుపుకుపోవటం లేదనే బండి సంజయ్‌ను తప్పించారని వెల్లడించారు. మురళీధర్ రావు వ్యాఖ్యలు ఇప్పుడు బీజేపీలోనూ కలకలం రేపుతున్నాయి. బండి సంజయ్ ను తప్పించింది.. .. బీఆర్ఎస్ కోసమని… ఓ వైపు లిక్కర్ స్కామ్ లో కవితను పక్కన పెట్టేసి… మరో వైపు పార్టకి ఊపు తెచ్చిన బండి సంజయ్ ను ఇతర రాష్ట్రాలకు పంపిచేస్తూ… సొంత పార్టీని డ్యామేజ్ చేసుకుంటూ ఏం సాధిస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

కిషన్ రెడ్డి అధ్యక్షుడు అయిన తర్వాత బీజేపీ కార్యకలాపాలు పూర్తిగా నీరసించి పోయాయి. ఆయనకేంద్ర మంత్రిగా ఉండటంతో… ఆ పనుల కోసం తిరగాల్సి వస్తోంది. తెలంగాణలో ఏ ధర్నాలు చేపట్టినా… జరుగుతున్నాయో లేదో అనే పరిస్థితికి వెళ్లిపోయింది. దానికి తోడు.. కేసీఆర్ ను పొగడ్తల్లో ముంచెత్తే నేతలు నోరు అదుపు చేసుకోలేకపోతూండటంతో… మొదటికే మోసం వస్తుంది. ఎన్నికలకు ముందు ఇంత ప్రణాళిక లేకుండా ఎందుకు తమ నెత్తిపై చేయి పెట్టుకుంటున్నారన్న ఆందోళన సహజంగానే బీజేపీ క్యాడర్ లో కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జ‌గ‌న్ బ్యాండేజీ.. మ‌ళ్లీ ట్రోల్స్ షురూ!

అదేదో యాడ్‌లో చెప్పిన‌ట్టు.. 'ఏపీలో ఏం న‌డుస్తోంది' అంటే 'బ్యాండేజీల ట్రెండ్ న‌డుస్తోంది' అంటారు అక్క‌డి జ‌నం. ప్ర‌చార స‌భ‌లో జ‌గ‌న్‌పైకి ఎవ‌రో ఓ అగంత‌కుడు గుల‌క‌రాయి విసిరిన ద‌గ్గ‌ర్నుంచీ ఈ బ్యాండేజీ...

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

ఐపీఎల్ ఎఫెక్ట్: బౌల‌ర్లే బ‌లి ప‌శువులు అవుతున్నారా?!

262 ప‌రుగుల ల‌క్ష్యం.. ఒక‌ప్పుడు వ‌న్డేల్లో ఈ టార్గెట్ రీచ్ అవ్వ‌డానికి ఛేజింగ్ టీమ్ ఆప‌సోపాలు ప‌డేది. ఇప్పుడు టీ 20ల్లోనే ఊదిప‌డేశారు. శుక్ర‌వారం కొల‌కొత్తా నైట్ రైడ‌ర్స్‌ - కింగ్స్ లెవెన్ పంజాబ్...

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close