స్టీల్ ప్లాంట్ అమ్మడం ఖాయమన్న కేంద్రం – ఈ క్రెడిట్ ఎవరిది ?

శాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటకరణను తాత్కలికంగా పక్కన పెట్టామంటూ కేంద్ర మంత్రి ఫగన్ సింగ్ చేసిన ప్రకటనతో కేంద్ర ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఆ అంశానికి విస్తృత ప్రచారం లభించింది. రాజకీయ పార్టీలన్నీ తమ ఘనతేనని ప్రకటించుకున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నేతలు కేటీఆర్, హరీష్ రావు అయితే కేసీఆర్ దెబ్బకు కేంద్రం దిగి వచ్చిందని ప్రకటించారు. బీఆర్ఎస్ ఏపీ చీఫ్ తోట చంద్రశేఖర్ .. తాము విశాఖలో విజయోత్సవాలు ఏర్పాటు చేశామని ప్రకటించేశారు.

అయితే మొత్తంగా కేంద్రం ఓ క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ లో వాటాల ఉపసంహరణ ప్రకియపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని.. ఆపడానికి కూడా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని.. స్పష్టం చేసింది. డిజిన్విస్టె మెంట్ ప్రక్రియ కొనసాగుతుదని ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేశారని వివిద పత్రికల్లో.. మీడియాలో జరుగుతున్న ప్రచారం కారణంగానే ఈ వివరణ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. చాలా రాజకీయ పార్టీలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయిందని ప్రచారం చేస్తున్నాయి. తమ వల్లేనని చెప్పుకుంటున్నాయి.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ప్రపంచ వ్యాప్తంగా ముసురుకుంటున్న ఆర్థిక మాంద్యం ప్రభావం కనిపిస్తోంది. అందుకే ప్రైవేటీకరణ ప్రక్రయి మెల్లగా సాగుతోంది. ముందస్తుగా మడిసరుకు కోసం ప్రైవేటు పార్టీల నుంచి ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ కోసం బిడ్ కోరారు. ఆ బిడ్ స్టీల్ ప్లాంట్ అమ్మకానికేనని ప్రచారం జరిగింది.అదికాదుకానీ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మాత్రం ఆగదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు క్రెడిట్ తీసుకున్న నేతలంతా ఏం చేస్తారో ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవారం బాక్సాఫీస్‌: ఎన్నిక‌ల‌కు ముందూ త‌గ్గేదే లే!

మే 13న ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. నెల రోజుల ముందు నుంచే ఈ ఎల‌క్ష‌న్ ఫీవ‌ర్ టాలీవుడ్ ని తాకింది. ఆ ఎఫెక్ట్ వ‌సూళ్ల‌పై తీవ్రంగా క‌నిపిస్తోంది. వారానికి రెండు మూడు సినిమాలొస్తున్నా...

మారుతి సినిమాకి ‘భ‌లే’ బేరం!

ఈమ‌ధ్య ఓటీటీ రైట్స్ విష‌యంలో నిర్మాత‌లు తెగ బెంగ ప‌డిపోతున్నారు. ఓటీటీలు సినిమాల్ని కొన‌డం లేద‌ని, మ‌రీ గీచి గీచి బేరాలు ఆడుతున్నార‌ని వాపోతున్నారు. అయితే కొన్ని సినిమాలు మాత్రం గ‌ప్ చుప్‌గా...

జైలు నుండే సీఎం రేవంత్ కు క్రిశాంక్ సవాల్

ఉస్మానియా వర్సిటీ పేరుతో సర్క్యూలర్‌ను మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేశారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నేత క్రిశాంక్ జైలు నుండే సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు. తాను...

ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పై వైసీపీ కంగారుతో ప్రజల్లో మరింత అనుమానాలు !

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్లో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా ప్రచారం అవుతోంది. ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోంది. దీన్ని ఆపాలని జగన్ రెడ్డి పోలీసుల్ని పురమాయిస్తున్నాయి. సీఐడీ కేసునూ పెట్టించగలిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close