ఉప ఎన్నికలలో తెరాసకు మంచి ఆయుధమే దొరికింది

ఇటీవల కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్ ఘర్ రాష్ట్రాలలో నిరుపేదల కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పధకంలో భాగంగా సుమారు 2.23లక్షల ఇళ్ళు కేటాయించింది. వాటిలో సుమారు 1.93లక్షల ఇళ్ళను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, 10, 000 ఇళ్ళను తెలంగాణా రాష్ట్రానికి మిగిలిన ఇళ్ళను గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్ ఘర్ రాష్ట్రాలకు కేటాయించింది. ఆంధ్రాకు సుమారు 85 శాతం ఇళ్ళు కేటాయించబడితే, తెలంగాణాకు కేవలం 10 శాతం ఇళ్ళు మాత్రమే మంజూరు అవడంతో తెరాస నేతలు కేంద్రప్రభుత్వం విమర్శలు గుప్పిస్తున్నారు. సరిగ్గా వరంగల్ ఉప ఎన్నికల ముందు, కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో ఈ ఎన్నికలలో బీజేపీని దెబ్బ తీసేందుకు తెరాసకు అదొక మంచి ఆయుధంగా లభించింది.

తెలంగాణా రాష్ట్రం పట్ల కేంద్రప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని మొదటి నుండి ఆరోపిస్తున్న తెరాస నేతలకు సరిగ్గా ఉప ఎన్నికల ముందు అందివచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని బీజేపీపై, కేంద్రప్రభుత్వం విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. తెలంగాణాకు కేంద్రప్రభుత్వం ఎప్పుడూ మొండి చెయ్యి చూపిస్తూనే ఉందని మళ్ళీ ఈ ఇళ్ళ కేటాయింపులో కూడా అలాగే చేసిందని నిజామాబాద్ తెరాస ఎంపి కవిత విమర్శించారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆంధ్రాకు చెందినవారయినప్పటికీ తెలంగాణా పట్ల మరీ ఇంత వివక్ష చూపడం సమంజసంగా లేదని ఆమె అన్నారు. తన నిజామాబాద్ నియోజక వర్గం ఒక్కదానికే సుమారు 75,000 ఇళ్ళు అవసరం ఉండగా, కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 10,000 రాష్ట్రం మొత్తానికి ఏవిధంగా సరిపోతాయని ఆమె ప్రశ్నించారు.

కేంద్రప్రభుత్వం తెలంగాణా రాష్ట్రానికి చాలా అన్యాయం చేస్తోందని, తాము పంపిన ప్రతిపాదనలను వేటినీ పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. ఎయిమ్స్ ఆసుపత్రి నిర్మాణానికి తాము పంపిన ప్రతిపాదనలపై కేంద్రప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదని ఆమె ఆరోపించారు. పార్లమెంటు సమావేశాలలో ఈ అంశంపై కేంద్రప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆమె అన్నారు. వరంగల్ ఉప ఎన్నికలకు పోలింగ్ ఈరోజు జరుగుతున్నందున, ఓటర్లపై తెరాస నేతలు చేస్తున్న ఈ విమర్శల ప్రభావం చూపే అవకాశం ఉంది. అదే జరిగితే బీజేపీ అభ్యర్ధి డా. దేవయ్య నష్టపోవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close