సాగర్‌లో టీఆర్ఎస్‌కు ఏకగ్రీవం కావాలట..!?

చనిపోయిన ప్రజాప్రతినిధుల కుటుంబాల్లోని వారికి ఉపఎన్నికల్లో ఏకగ్రీవం చేసే సంప్రదాయం ఉందని… నాగార్జునసాగర్‌లోనూ విపక్షాలు అదే పాటించాలని.. టీఆర్ఎస్ నేత.. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అడుగుతున్నారు. నాగార్జునసాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య చనిపోవడంతో ప్రస్తుతం అక్కడ ఉపఎన్నిక జరగాల్సి ఉంది. ఉపఎన్నిక అంటే.. టీఆర్ఎస్‌కు ఆందోళన ప్రారంభమయింది. దీంతో… నాగార్జునసాగర్‌ గండాన్ని ఎలా గట్టెక్కాలన్నదానిపై టీఆర్ఎస్ చర్చోపచర్చలు నిర్వహిస్తోంది. గాల్లో ఓ రాయి వేద్దామన్నట్లుగా ఏకగ్రీవం ప్రస్తావన కూడా తీసుకు వచ్చింది. గుత్తా ప్రతిపాదనపై విపక్ష పార్టీల నేతలే సెటైర్లు వేస్తున్నారు. ఓ సారి.. వెక్కి తిరిగి చూసుకోమని సెటైర్లు వేస్తున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఎవరైనా చనిపోతే… వారి కుటుంబసభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకునే సంప్రదాయం ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ దాన్ని పట్టించుకోలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చనిపోయినప్పుడు… కనీసం సానుభూతి కూడా లేకుండా.. తెలంగాణ సెంటిమెంట్‌తో.. అభ్యర్థుల్ని పోటీ చేయించారు. పాలెరులో వెంకటరెడ్డి… నారాయణఖేఢ్‌లో పటోళ్ల కృష్ణారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండేవారు. వారు చనిపోవడంతో ఉపఎన్నికలు వచ్చాయి. కానీ కేసీఆర్ ఈ ఏకగ్రీవ సంప్రదాయాన్ని పక్కన పెట్టేశారు తన పార్టీ నేతల్ని పెట్టి… పెద్ద ఎత్తున పార్టీ బలగాలను మోహరించి.. విజయం సాధించారు. పాలేరులో తుమ్మలను గెలిపించారు. ఖేడ్‌లో భూపాల్ రెడ్డిని గెలిపించారు. సంప్రదాయాలను పాటించాలని అప్పట్లో విపక్ష నేతలు చెప్పినా లెక్క చేయలేదు.

ఇప్పుడు.. టీఆర్ఎస్‌కు గడ్డు కాలం వచ్చింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు చనిపోతున్నారు. దుబ్బాక లాంటి చోట్లోనే తెలంగాణ సెంటిమెంట్ పని చేయలేదు. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రస్థాయిలో పెరిగింది. అదే సమయంలో ఉపఎన్నికల్లో అధికార పార్టీ అడ్వాంటేజ్.. . పథకాలు కూడా పారడం లేదని.. గ్రేటర్ ఎన్నికల్లో తేలిపోయింది. మరో వైపు.. బీజేపీ ఎదిగిపోతోంది. ఉపఎన్నికల ద్వారా.. ఆ పార్టీకి మరింత అవకాశం కల్పిస్తున్నట్లుగా అవుతోంది. ఇప్పుడు… తనకు అవసరం వచ్చింది కాబట్టి.. టీఆర్ఎస్ … ఏకగ్రీవం.. సంప్రదాయాల్ని బయటకు తెస్తోందన్న విమర్శలు ఎదుర్కొంటోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close