ఎస్పీ రాంసింగ్‌ నుంచి డీఐజీ చౌరాసియాకు వివేకా హత్య కేసు !

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. దర్యాప్తు అధికారి సీబీఐ ఎస్పీ రాంసింగ్‌ను విచారణ నుంచి తప్పించింది. సీబీఐ డీఐజీ కేఆర్ చౌరాసియా నేతృత్వంలో ప్రత్యేకంగా సిట్ నియమించింది. ఈ సిట్‌లో ఆరుగురు ఇతర సభ్యులు ఉన్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో విస్తృతమైన కుట్ర కోణాన్ని అత్యంత వేగంగా వెలికి తీయాలని సుప్రీంకోర్టు సీబీఐ సిట్‌ను ఆదేశించింది. ఇప్పటి వరకూ సీబీఐ చేసిన విచారణను పరిగణనలోకి తీసుకుంటున్నట్లుగా సుప్రీంకోర్టు తెలిపింది.

డీఐజీ చౌరాసియా నేతృత్వంలో సీనియర్ అధికారులు పని చేయనున్నారు. త్త సిట్‌లో ఐపీఎస్ అధికారి, ఎస్పీ వికాస్ కుమార్, అడిషన్ ఎస్పీ ముఖేష్ శర్మ, ఇన్‌స్పెక్టర్ ఎస్.శ్రీమతి, మరో ఇన్‌స్పెక్టర్ నవీన్ పునియా, సబ్ ఇన్‌స్పెక్టర్ అంకిత్ యాదవ్ సభ్యులుగా ఉండనున్నారు. ఏప్రిల్ 30లోగా విచారణ ముగించాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఆరు నెలల్లోగా ట్రయల్ మొదలుకాకపోతే ఈ కేసులో ఏ5 నిందితుడు బెయిల్ కోసం దాఖలు చేసుకోవచ్చని తెలిపింది. ఏ-5 నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి భార్య దాఖలు చేసిన పిటిషన్ పై విచారణలో భాగంగానే సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం రాంసింగ్ పర్యవేక్షణలో విచారణ ఆలస్యమవుతోందని ఆయనను తొలగించాలని గత విచారణలో సూచించింది. గత విచారణలో అవసరమైతే రాంసింగ్‌ను ఉంచండి.. రాంసింగ్‌కు అదనంగా మరో అధికారిని కూడా నియమించండి ధర్మాసనం తెలిపింది. అయితే ఈరోజు మరో అధికారిని నియమిస్తూ సీబీఐ నివేదిక ఇచ్చిన క్రమంలో రాంసింగ్‌ను కొనసాగించడంపై సుప్రీం తీవ్ర అభ్యంతరం తెలిపింది. దీంతో కొత్త సిట్ ప్రతిపాదనను సుప్రీం కోర్టు ముందు ఉంచారు. కొత్త సిట్ ఏర్పాటును ధర్మాసనం అంగీకరించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంద్రానికి నిప్పెట్టిన దేవర

https://youtu.be/CKpbdCciELk?si=XoyRoPJZB05oVwwN ఎప్పుడెప్పుడా అని ఎన్టీఆర్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన ‘దేవర’ ఫియర్ సాంగ్‌ వచ్చేసింది. రేపు (మే 20).. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా టీమ్‌ తొలి పాటను విడుదల చేసింది. పేరుగా తగ్గట్టుగానే టెర్రిఫిక్...

చోరుడు రివ్యూ : అడవి దొంగ పాయింట్ బావుంది కానీ…

స్టార్ కంపోజర్ గా కొనసాగుతూనే మరోవైపు నటునలో కూడా బిజీగా వున్నారు జీవి ప్రకాష్ కుమార్. ఇటీవల ఆయన నుంచి వ‌చ్చిన‌ 'డియర్' సినిమా నిరాశపరిచింది. ఇప్పుడు ఆయన టైటిల్ రోల్ చేసిన...

అమెరికాలో వల్లభనేని వంశీ

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అమెరికా వెళ్లారు. పోలింగ్ అయిపోయిన తర్వాత చాలా మంది వెళ్లారు కానీ.. అందరూ తిరిగి వస్తారు.. కానీ వంశీ వస్తారా లేదా అన్నది మాత్రం...

ఫాక్స్ లింక్ పరిశ్రమ తిరుపతి నుంచి చెన్నైకి జంప్ !

యాపిల్‌కు విడిభాగాలు తయారు చేసి సప్లయ్ చేసే ఫాక్స్ లింక్స్ కంపెనీ ఏపీ నుంచి తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోయింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నారా లోకేష్ ఈ పరిశ్రమను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close