తెలకపల్లి రవి : సందేహాలతో బాబు సాకుల వేటా?

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదేపదే విజయవాడ ప్రాంతంలో అద్దెల గురించి, భూముల రేట్ల గురించి ప్రస్తావించడం అక్కడి ప్రజలకు రుచించడం లేదు. రాజధాని వస్తే అభివృద్ధి వస్తుందని వూరించిన ముఖ్యమంత్రి ఇప్పుడు అద్దెలు కొంచెం పెరగ్గానే ఏదో అయిపోయినట్టు తానే ఎందుకు ప్రచారం చేస్తున్నారని అడుగుతున్నారు. భూముల లావాదేవీలు స్తంభించిపోయి అనేకమంది సంక్షోభంలో కూరుకుపోయారు. కాని సిఎం మాత్రం భూముల రేట్ల పెంపు అంటున్నారు. ఒకోసారి ఎందుకు రాజధాని అనిపిస్తుంది అని ఒక శాసనసభ్యుడన్నారు. పెట్టుబడులు ప్రవాహంలా వస్తాయని చెప్పిన ప్రభుత్వమే దీనివల్ల పెట్టుబడులు ఆగిపోతాయని హెచ్చరించడం న్యాయమేనా అని ఒక స్థానిక వ్యాపారి ప్రశ్నించారు. నిజంగా ఏమీ జరగడం లేదు గనక నెపం మా మీద పెట్టడానికే ఇలా మాట్లాడుతున్నారా అని కూడా సందేహం వ్యక్తం చేశారు. అసలు చంద్రబాబుకే సందేహాలు పెరిగిపోయి సాకులు వెతుకుతున్నారని మరో పరిశీలకుడు వ్యాఖ్యానించారు.

మాటలు జాగ్రత్తగా వాడకుండా పొరబాటు సంకేతాలు పంపడం రివాజుగా మారిన ముఖ్యమంత్రి ఈ రోజు ఎల్‌వి ప్రసాద్‌ ఆస్పత్రి ప్రారంభ కార్యక్రమంలో అనవసరంగా ప్రాంతాల తేడా గురించి చెప్పారు. ఇక్కడ అద్దెలు పెరిగిపోతే పెట్టుబడులు రాయలసీమకు పోతాయని అక్కడికి పోతే వేరే రాష్ట్రాలకు పోతాయని హెచ్చరించారు. నిజంగా రాయలసీమకు పోతే విచారించాల్సిన పని ఏముంటుంది? ఇప్పటికే ఆ ప్రాంతంలో కొన్ని అనుమానాలు, ఆందోళనలు సాగుతుంటే స్వయానా చంద్రబాబు ఇలా మాట్లాడ్డం ఉచితమేనా అని రాయలసీమకు చెందిన ఒక సీనియర్‌ నాయకుడు అన్నారు. ఆయన మనసులో మాట ఇలా బయిటకు వచ్చిందని కూడా వ్యాఖ్యానించారు. ఏమైనా ఆతృతలో హడావుడిలో పొరబాటు సంకేతాలు పంపుతుంటే కష్టమవుతుందని అవసరాన్ని మించి మాట్లాడ్డం, ముందుగా హౌం వర్క్‌ చేయకపోవడం వల్లనే ఇలాటి తప్పిదాలు జరుగుతున్నాయని పాలక పార్టీ నాయకులు కూడా అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close