ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్య అతిధిగా పాల్గొన్న విశాఖ అంతర్జాతీయ యోగా దినోత్సవం.. యోగాంధ్ర గిన్నిస్ రికార్డు సృష్టించింది. విశాఖలో మూడు లక్షల మందికిపైగా ప్రధాని మోదీతో కలిసి యోగా చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నారాలోకేశ్ సహా మంత్రులు,కేంద్రమంత్రులు,అధికారులు అంతా పాల్గొన్నారు. విశాఖ నుంచి బోగాపురం వరకూ ఏర్పాటు చేసిన వేదికలో.. మూడు లక్షల మంది నేరుగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది గిన్నిస్ రికార్డు. గతంలో సూరత్లో నమోదైన యోగా కార్యక్రమం రికార్డు బ్రేక్ అయింది.
యోగా అనేది మన నాగరికత సాధించిన గొప్ప విజయాల్లో ఒకటి.. ఈ ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప బహుమతుల్లో ఒకటిగా చెప్పుకుంటారు. యోగా శరీరం, మనస్సు మధ్య సమతౌల్యం ఏర్పరుస్తుంది. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే సామర్ధ్యాన్ని పెంచుతుంది , యోగాను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగం చేసుకోవాలన్న సందేశాన్ని పంచేందుకు యోగా దినోత్సవం నిర్వహించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక అంతర్గత శాంతి సవాళ్లకు యోగా చక్కని మార్గం చూపుతుందని ప్రధాని మోదీ అన్నారు. శాంతి, స్థిరత్వం సాధించవచ్చన్నారు.ప్రజల శారీరక, మానసిక శాంతి కోసం జీవన విధానంలో యోగాను భాగం చేసేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకూ గంట సేపు అందరూ యోగా చేశారు. ప్రధాని మోదీ, చంద్రబాబు, లోకేష్, పవన్ కూడా కూడా గంట సేపు. . అందరితో పాటు యోగా చేశారు. మూడు లక్షల మంది పూర్తి స్థాయిలో ఏకాగ్రతతో .. ఈ కార్యక్రమంలో యోగా చేశారు. నెల రోజుల నుంచి క్రమబద్ధంగా నిర్వహించిన ఏర్పాట్లు.. అద్భుతంగా కార్యక్రమం నిర్వహించడానికి ఉపయోగపడ్డాయి.